నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా
పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం
మాజీ మంత్రి హరీష్ రావు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మూసీ సుందరీకరణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో సారి ఒక్కో ప్రకటన చేస్తున్నారని ఏది నిజమో అంతు చిక్కడం లేదన్నారు. మేసీ సుందరీకరణపై ప్రభుత్వం వెచ్చించాలను భావిస్తున్న నిధులు ఎన్నో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు య స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూ సేకరణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా?2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బి ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలి. అలాగే సేలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు?మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డుకుంటాం. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టండి. కానీ, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
ప్రభుత్వానికి స్పష్టత ఉందా….ఎంఐఎం

మూసీ సుందరీ కరణపై ప్రభుత్వానికి ఎంత వరకు స్పష్టత ఉందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణలో భాగంగా గోదావరి నదీ జలాలను తరలిస్తామని అంటున్నారు. వర్షాలు కురిస్తే నగరంలో వచ్చే మూసీ వరదలను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.పేదలు నదుల పక్కన జీవనం కొనసాగిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చే కుట్రను ప్రభుత్వం చేస్తుందన్నారు. మూసీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని హిమాయత్ సాగర్, గండిపేట క్యాచ్ మెంట్ ఏరియా ఎంత ఉంది…..అక్రమణలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పునారవాస చర్యలు పకడ్భంధీగా తీసుకోవాలన్నారు.









Leave a Reply