NewsInn

News in a Click

బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేరు…!

బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేరు…!

బ‌బుల్ షూట‌ర్ తోనే ట్ర‌బుల్స్

సీఎం తీరు మార్చుకోవాలి

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేద‌ని స్వ‌యంగా అధినేత రంగంలోకి దిగితే త‌ప్ప పార్టీలో మార్పు రాద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు చేశారు. హార‌ష్ రావ్ పై ఆరోప‌ణ‌ల‌ను కొన‌సాగిస్తూనే ఆమె వ‌చ్చారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా త‌న రాజీనామాను అమోదించాల‌ని మండ‌లి చైర్మ‌న్ ను క‌లిసేందుకు వ‌చ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ ఎస్ పై ఘాటుగా విమర్శ‌లు గుప్పించారు. పాల‌మూరు రంగారెడ్డి ప‌థ‌కం నుంచి ఒక్క ఎక‌రా కూడా నీళ్లు ఇవ్వ‌లేద‌న్న‌ది వెయ్యిశాతం నిజ‌మ న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ లో ప్ర‌స్తావించిన ఇన్ టేక్ పాయింట్ మార్చిన విష‌యాన్ని క‌విత కూడా నేడు ప్ర‌స్తావిస్తూ ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసిఆర్ వివ‌రించాల‌ని డిమాండ్ చేశారు. బ‌బుల్ షూట‌ర్ కు పెత్త‌నం ఇచ్చి స‌మాధానం చెప్పిస్తే ప్ర‌జ‌ల‌కు అర్ధం కాద‌ని హ‌రీష్ రావ్ ను ఉద్దేశించి మ‌రో సారి క‌విత వ్యాఖ్యానించారు.అసలు బబుల్ షూటర్ వల్లే ఈ ట్రబుల్ వచ్చిందన్నారు…… బబుల్ షూటర్ కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బ పడింద‌ని ఆరోపించారు. ఇంకా అలాంటి వాళ్ల‌కే ప‌తెత్త‌నం ఇచ్చి వారితో స‌మాధానాలు చెప్పియ‌డం పార్టీకి శ్రేయ‌స్కరం కాద‌ని క‌విత అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ ను క‌సబ్ తో పోల్చ‌డాన్ని క‌విత త‌ప్పుబ‌ట్టారు. రెండేళ్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా పాలూమ‌రు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప‌ట్టించుకోకుండా ఇప్పుడు తెర‌పైకి తేవ‌డం ముఖ్య‌మంత్రి పాల‌మూరు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ట్లే అని అన్నారు.పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం విష‌యంలో కూడా సీఎం రేవంత్ పాల‌మూరు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. కొడంగల్- నారాయణ్ పేట్ -మక్తల్ లిప్ట్ ఇరిగేషన్ ఎందుకు బీమాను ఇన్ టేక్ పాయింట్ గా తీసుకున్నారు. బీమా చిన్న పిల్ల కాల్వ. మీకు ఆంధ్రా నేతలతో ఏం లాలూచీ ఉందని ప్ర‌శ్నించారు.
ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ల ప్రాంత ప్రయోజనాల కోసం మన నీళ్లు దోచుకుంటున్నారు. కానీ తెలంగాణ నాయకుల్లో మాత్రం ఆ చిత్తశుద్ధి లోపించిందని క‌విత వ్యాఖ్యానించారు.

అవ‌కాశం ఇవ్వండి…..ఆమోదించండి….

త‌న రాజీనామాను ఆమోదించాల‌ని నాలుగు నెల‌ల క్రితం మండ‌లి చైర్మ‌న్ కు లేఖ పంపినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదం తెల‌ప‌లేద‌ని వెంట‌నే ఆమోదించాల‌ని మండ‌లి చైర్మ‌న్ ను క‌లిసి కోరిన‌ట్లు క‌విత వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో రాజీన‌మా ఆమోదానికి ముందు మండ‌లిలో మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరితే 5వ తేదీన అవ‌కాశం క‌ల్పించార‌ని క‌విత చెప్పారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై 5వ తేదీన అన్ని విష‌యాలు ప్ర‌స్తావిస్తాన‌ని క‌విత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *