NewsInn

News in a Click

మూసీ ప్రాజెక్టు సీఎం క‌మీష‌న్ల కోస‌మే

మూసీ ప్రాజెక్టు సీఎం క‌మీష‌న్ల కోస‌మే

కొత్త డీపీఆర్ రూపొందించ‌డ‌మే నిద‌ర్శ‌నం

కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టును సీఎం క‌మీష‌న్ల కోస‌మే ముందుకు తెస్తున్నార‌ని బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు.త‌న అక్ర‌మ సంపాద‌న‌ను అడ్డుకుంటున్నామ‌నే కుట్ర‌తో త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు. అసెంబ్లీలో మూసీపై అన్నీ అబ‌ద్ధాలే చెప్పార‌ని విమ‌ర్శించారు. డీపీఆర్ సిద్ధం అయ్యేందుకు మ‌రో ఏడాదిస‌మ‌యం తీసుకుంటే 1.5 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని సిఎం ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ బ్యూటిఫికేష‌న్ పేరుతో రేవంత్ టూటిఫికేష‌న్ కు తెర‌తీస్తున్నార‌ని ఆరోపించారు.భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్ర‌శ్నించారు. .బీఆర్ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. దీన్ని కాద‌ని కమిషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని విమ‌ర్శించారు. మాప్ర‌భుత్వ హాయంలో దాదాపు 16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అంచనాలను లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *