NewsInn

News in a Click

ఉత్త‌రాది రాష్ట్రాల పెత్త‌నం పెరిగుతోంది- సీత‌క్క‌

ఇద్ద‌రు పిల్ల‌ల నిబంద‌న ఎత్తివేస్తూ అసెంబ్లీ తీర్మానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల కంటే ఎక్కువ మంది సంతానం క‌లిగి ఉంటే పోటీకి అన‌ర్హ‌ల‌ని గ‌తంలో ఉన్న‌నిబంధ‌న‌ను ఎత్తి వేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యంతీసుకుంది. ఈ నిబంధ‌న‌తో ఎంతో మంది నేత‌లు గ్రామీణ ప్రాంతాల్లో పోటీచేసేందుకు ఉత్సాహంగా ఉన్నా .. నిబంధ‌న‌ల కార‌ణంగా దూరంగా ఉండాల్సి వ‌చ్చేది. ఈ ప‌రిస్థితికి పులిస్టాప్ పెడుతూ పంచాయతీరాజ్ చట్టంలోని 21 వ సెక్షన్ సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి సీత‌క్క ప్ర‌వేశ పెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా..నేడు బిల్లుకు స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామ పేరును.. జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లుకు కూడా స‌భ ఆమోదం ల‌భించింది. ఈ సంద‌ర్బంగా అసెంబ్లీలో ప్ర‌సంగించిన సీత‌క్క గ‌తంంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సూచ‌న‌ల‌కు అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాలు జ‌నాభానియంత్ర‌ణ‌నను పాటించాయ‌ని,ఉత్తరాది రాష్ట్రాల్లో ఈప‌రిస్థితులు లేవ‌న్నారు. ఈ కార‌ణంగా ఉత్త‌రాది రాష్ట్రాల ఆధిపత్యం ద‌క్షిణాది ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌న్నారు. మన రాష్ట్రంలో జనాభా నియంత్రణ పూర్తిస్థాయిలో పాటించడం వల్ల జనాభా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తు దృష్టిలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదని నిబంధనను తొలగిస్తున్నామని చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మా నిర్ణ‌యాన్ని గౌర‌వించార‌ని సీత‌క్క చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *