చరిత్ర ఉన్న నగరాలు- గూగుల్ తో విభజనా
జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర
తలసాని శ్రీనివాస్ యాదవ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ మహానగరాన్ని ప్రభుత్వం ఇష్టానుసారంగా విభజిస్తోందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ఆరోపించారు. ఈ జంటనగరాలకు ఎంతో చరిత్ర ఉందని, వాటి ఉనికికి ప్రమాదం తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా విభజన చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఉందని ఆరోపించారు.సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పేరు మార్చేందుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారంజరుగుతోందని ధైర్యం ఉంటే పేరు మార్చి చూడాలని హెచ్చరించారు. మహానగర విభజన పై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని తలసాని అన్నారు.24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. పాలన సౌలభ్యం కోసం బిఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ లో పెద్ద ఎత్తున నిరసనకార్యక్రమాలు చేపడుతామని తలసాని ప్రకటించారు.

అసెంబ్లీలో కూడా అంతే…
తన రాజకీయ అనుభవంతో ఎంతో మంది ముఖ్యమంత్రులను, స్పీకర్ లను చూశానని ఇలాంటి సీఎం, స్పీకర్ ను ఎప్పుడూ చూడలేదన్నారు. కనీసం ప్రతిపక్ష పార్టీ వైపు చూసేందుకు స్పీకర్ సాహసం చేయడం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా పోరాడం మా బాధ్యత అని తలసాని అన్నారు.గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్న స్పీకర్ అడ్డు చెప్పలేదన్నారు.రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదు.



Leave a Reply