కేసిఆర్ అసెంబ్లీకి రారా
హరీష్ ను విమర్శిస్తే అసెంబ్లీ భహిష్కరిస్తారా
కవిత ఇన్ కన్ప్పూజన్…మంత్రి
అంతుచిక్కని కవిత వ్యూహం
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ నేతలకు పాఠాలు చెప్పే పనిలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కవిత చేస్తున్న వ్యాఖ్యలపై గులాబీ నేతలు వ్యంగంగా పార్టీ నుంచి వెళ్లి పార్టీకి పాఠాలు చెబుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కవిత తప్పబడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుండగా ఎవరినో ( హరీష్ రావ్) ను ఒక్క మాట అన్నారని శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా సభలో లేకపోతే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారంటూ ప్రశ్నించింది.

అదే విధంగా పార్టీ అధినత కేసిఆర్, కవిత తండ్రి కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తప్పు బట్టింది. కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే పిల్లకాకుల నుంచి అధికార పార్టీని తట్టుకోవడం సాధ్యం కాదని ప్రకటన చేశారు. హరీష్ రావ్ కు శాసనసభా పక్షం ఉప నేతగా అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టింది. హరీష్ పార్టీలో సొంత గ్రూపు సిద్ధం చేసుకుంటున్నారన్న ఆరోపణలు చేస్తోంది.కృష్ణా జలాల విషయంలో కూడా కవిత స్పందించిన తీరు చర్చనీయంశంగా మారింది. అసెంబ్లీని బహిష్కరించిన గులాబీ పార్టీ తెలంగాణా భవన్ లో ఆదివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. ఈ పీపీటీకి ముందు కొన్న ప్రశ్నలను కవిత హరీష్ రావ్ పై నేరుగా స్పందించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పీపీటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మూసీ నదీ, గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై ఎంతో చర్చ జరుగుతున్నా ప్రతిపక్షం సభలో లేకపోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.

కవిత లేవనేత్తిన ఆంశాలు, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. కృష్ణా జలాల ఇన్ టేక్ సోర్స్ మార్చడం వెనుక హరీష్ రావ్ ధనదాహం అంటూ కవిత నేరగా హరీష్ రావ్ పై ఆరోపణలు చేసింది….అంతకు ముందు ఇవే ఆరోపణలను అధికార పార్టీ కూడా చేసింది. కృష్ణా జలాల ఇన్ టేక్ ను జూరాల నుంచి శ్రీశైలం కు ఎందుకు మార్చారో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బహిష్కరించారో చెప్పాలంటూ సీఎం వ్యాఖ్యలు చేస్తూంటే కవిత కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాలు తెచ్చే చర్చపై ఒక్కో అంశం ప్రాతిపదికగా బహిష్కరించడం సహాజం….కానీ మొత్తం సమావేశాలను ఎలా బహిష్కరిస్తారని కవిత ప్రశ్నించారు. ఇలా అధికార పార్టీ లేవనెత్తే అంశాలకు….కవిత చేస్తున్న వ్యాఖ్యలకు దాదాపు సామీప్యత ఉండడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

బీఆర్ ఎస్ కీలక నేత పార్టీ శాసనసభా పక్షం ఉప నేత హరీష్ రావ్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటాడుతున్నారు. హరీష్ రావ్ చేస్తున్న ప్రకటనలతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలకు హరీష్ రావ్ మాత్రమే బాధ్యడఅన్న వాదనను తెరపైకి తెస్తోంది. రెండు విడతల బీఆర్ ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావ్ ఆర్ధిక, ఆరోగ్య, నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండు శాఖలపై పెద్దగా చర్చ లేకపోయినా….. తెలంగాణాలో ప్రస్తుతం నీటి పారుదల రంగంపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది. కృష్ణా నదీ జలాల వాటా దక్కకపోవడానికి మీరంటే మీరు కారణమంటూ అధికార,ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికార పార్టీ తీరు పై పెద్దగా స్పందించకుండా ప్రతిపక్ష పార్టీని అందులో వరుసకు బావ అయ్యే హరీష్ రావ్ ను టార్గెట్ చేయడం పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ మారుతోంది.

హరీష్ రావ్ పై విమర్శలు చేసినందుకే పార్టీ అదినేత కేసిఆర్ తన కూతురైనా చూడకుండా కవతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాదాపు నాలుగైదు నెలలుగా బీఆర్ ఎస్ పార్టీని, హరీష్ రావ్ ను టార్గెట్ చేయడంపై కవిత దృష్టి సారించడం అసలు కవిత టార్గెట్ అధికార పార్టీనా… బీఆర్ ఎస్ పార్టీనా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు కవిత ను టార్గెట్ చేసేందుకు వెనుకా ముందు ఆలోచిస్తున్నా…. కాంగ్రెస్ నేతలు కవిత వ్యాఖ్యలను తమ అస్త్రాలుగా వాడుకుంటున్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కవిత కన్య్పూజ్ లో ఉంటూ అందరినీ కన్ప్యూస్ చేస్తోందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






Leave a Reply