NewsInn

News in a Click

కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో సీఎం, మంత్రుల‌ది వాటాల పంచాయ‌తీ

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సింగ‌రేణి లో కుంభ‌కోణాలు చేసేందుకు ముఖ్య‌మంత్రి, మంత్రులు ఎవ‌రికి వారే కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, వాటాల్లో తేడా రావ‌డంతోనే నైనీ బొగ్గు గ‌నుల వేలం కుంభ‌కోణం తెర‌పైకి వ‌చ్చిందిన మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం వెనుక ఎంతో త‌తంగం న‌డించింద‌ని హ‌రీష్ రావ్ ఆరోపించారు.కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి నైనీ బ్లాక్ లో పెట్టారు, అందువల్ల నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నాం అని భట్టి ప్ర‌క‌టించారు. ఈ విధానంలో దేశంలో ఎక్క‌డా లేద‌ని రేవంత్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న‌త‌రువాతే ఈ విధానంలో రాష్ట్రంలో అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింద‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజెపితో పోరాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం బీజెపీ, చంద్ర‌బాబుల‌తో క‌లుస్తూ రాష్ట్రంలో పాల‌న చేస్తున్నార‌ని హ‌రీష్ రావ్ సీఎం పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వం తెచ్చిన సైట్ విజిట్ విధానంతో మొద‌టి ల‌బ్ది దారుడు రేవంత్ రెడ్డి బావ‌మ‌రిది సుజ‌న్ రెడ్డి అని హ‌రీష్ రావ్ వెల్ల‌డించారు. ఈ విధానం వచ్చాక సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్ కు టెండర్లు వారి అనుయాయకులకు కట్టబెట్టడం జరిగిందని ఆరోపించారు..కోల్ బ్లాక్ టెండర్ మన దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుందని, గ‌తంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 పోయిన విష‌యాన్ని హ‌రీష్ ప్ర‌స్తావించారు. రేవంత్ రెడ్డి కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయి.
భట్టి గారు కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నార‌ని, మిగిలిన టెండ‌ర్ల సంగతేమిట‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం సింగ‌రేణిలో కుంభ‌కోణాల‌కు తావిస్తోంద‌ని, ద‌మ్ముంటే సింగ‌రేణి వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం సీబిఐ విచార‌ణ కోరాల‌ని హ‌రీష్ రావ్ డిమాండ్ చేశారు. అన్ని వివ‌రాలు తాను అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో అన్ని కేసుల‌ను సిట్ అంటూ వేస్తున్నా సింగ‌రేణి విష‌యంలో సీబీఐ విచార‌ణ కోరి త‌మ నిజాయితీని నిరూపించుకోవాల‌ని స‌వాల్ విసిరారు.రేవంత్ రెడ్డి, బిజేపీ అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ కాదా? అని ప్ర‌శ్నించారు. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి గారు, టెండర్లు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బికి మార్చి టెండర్లు దక్కించుకున్నార‌ని ఆరోపించారు.హాలో గ్రాం టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలి అయ్యాడన్నారు.నువ్వు కూలిస్తే కూలిపోవడానికి బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో లేదు, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని హ‌రీష్ రావ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *