ఈ కార్ రేస్ స్కాం అయితే గ్రీన్ కో చర్చలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ప్రభుత్వం ధ్వంధ వైఖరిని అవలంభిస్తోందిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ కేస్ స్కాం అంటూ విచారణ మొదలు పెట్టిన తెలంగాణా సర్కార్….దావోస్ లో గ్రీన్ కో ఎనర్జీతో చర్చలు జరపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ ధ్వంధ విధానాలకు ఇది అద్దం పడుతోందన్నారు. తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కో తో చర్చలు జరిపి దాన్ని కాపాడేందుకు బ్యాగులు పుచ్చుకున్నారా అని సీఎంను ప్రశ్నించారు. దావోస్ కేంద్రంగా ఓ బీజెపీ ఎంపీ, పలువురు మంత్రులు, ఓ మంత్రి తనయుడు చర్చలు జరుపుతుండడం దీనికి సంకేతమన్నారు.ఫ్యూచర్ లేని సిటీ….పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం జవాబు ఇవ్వాలని అన్నారు. చాలా చోట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, కొత్త జిల్లాలు చేసిన పట్టణాల్లో జిల్లాలు ఎత్తేస్తారన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి…
సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచి విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, సింగరేణిపై మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జిని వేయించి, సింగరేణి మీద మీరు ఎప్పటి నుంచి చేస్తామంటే అప్పటి నుంచి విచారణ చేయండి మాకు అభ్యంతరం లేదన్నారు. 2014 నుంచి విచారణ చేయండి. కాకపోతే ‘విజిట్ సైటేషన్ సర్టిఫికేట్’ అనే పనికిమాలిన నిబంధన ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండేదని, తాము ఏమీ మార్చలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, సమాధానం చెప్పేవరకు ఆయన వెంబడి పడతామని అన్నారు. రేవంత్లో ‘రాము’ ఉన్నాడు, ‘రెమో’ ఉన్నాడని వ్యాఖ్యానిస్తూ, ఒకవైపు సినిమా టికెట్లు పెంచమని చెబుతూనే మరోవైపు టికెట్లు పెంచుతూ జీఓలు ఇస్తారని విమర్శించారు. సర్వాయి పాపన్న పేరుతో జనగామ జిల్లా చేస్తామని చెప్పి, ఇప్పుడు అదే జిల్లాను తొలగిస్తామని అనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.



Leave a Reply