NewsInn

News in a Click

కాంగ్రెస్ పై పోరాటం చేయాల్సి వ‌స్తుంది

ప్రొఫెసర్ కోదండరాం ప్ర‌క‌ట‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మున్సిప‌ల్ ఎన్నిక‌లు కాంగ్రెస్, మిత్ర ప‌క్షాల్లో అనుమానాలు రేపుతున్నాయి. ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష‌మైన తెలంగాణా సమితి పార్టీకి కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఎలాంటి చ‌ర్య‌లు జ‌రుప‌క‌పోవ‌డంపై జ‌న‌స‌మితి అధ్య‌క్షులు ప్రొ. కోదండ‌రాం కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన చ‌ర్చ‌లు,ఇచ్చిన హామీల‌పై కాంగ్రెస్ అనుస‌రిస్తున్న వైఖ‌రి స‌మ‌ర్ధ‌నీయం కాద‌న్నారు. ప్ర‌భుత్వ తీరు ప‌రిశీలిస్తుంటే సామ‌న్య ప్ర‌జ‌ల్లో కూడా వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌న్నారు. ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కోదండ‌రాంకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టినా అది వివాద‌స్ప‌దంగా మారి ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వీ త్రిశంకు స్వ‌ర్గంలో కి చేరింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఎప్పుడైనా వ‌చ్చే అవ‌కాశం ఉన్నా జ‌న‌స‌మితి అభ్య‌ర్థుల‌కు మున్సిపాల్టీల్లో స్థానాలు కేటాయించ‌క‌పోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. త‌న పార్టీకి ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోక‌పోవ‌డంపై కోదండ‌రాం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలిటిక‌ల్ వార్ కు తెర‌లేపిన సింగ‌రేణి స్కాంపై ప్ర‌భుత్వంపై విప‌క్షాలు విరుచుకు ప‌డుతున్న స‌మ‌యంలో కోదండ‌రాం కూడా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటూఏ సింగ‌రేణిని కార్పోరేట్ సంస్థ‌ల‌కు అప్పగించేందుకు రెడీ అవుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ తీరు ఇలాగే ఉంటే మిత్ర‌ప‌క్షం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *