నల్లమలసాగర్ కు రేవంత్ గ్రీన్ సిగ్నల్ : హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ఏపీ నీటి దోపిడికి సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు.సమైక్య పాలనలో తెలంగాణాకు అన్యాయం చేసిన పాలకుల దారి లోనే ప్రస్తుత కాంగ్రస్ పాటన కొనాసగుతుందన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తాము ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా…. ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తోందన్నారు. సమైక్యపాలనలో నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే దారిలో నడుస్తుందన్నారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబబాబు ది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి అని హరీష్ రావ్టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా తెలంగాణా అంగీకారం తెలిపిందన్నారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర జరుగుతోందన్నారు. ఈ మీటింగ్ కు వెళ్లే ఆదిత్యా నాథ్
తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మానుకోవాలని హరీష్ రావ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ ఎస్హాయంలో జరిగిన ప్రగతి పథాన్ని వివరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.






Leave a Reply