NewsInn

News in a Click

సమ్మక్క–సారక్క జాతర హూండీల లెక్కింపు ప్రారంభం

125 హుండీల‌తో రూ.2.49 కోట్ల ఆదాయం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

వారం రోజుల క్రితం జ‌రిగిన మేడారం జాత‌ర పూర్తి కావ‌డంతో అధికారులు అక్క‌డ ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు ప్ర‌క్రియ‌ను అధికారులు మొద‌లు పెట్టారు. హ‌నుమకొండ‌లో నిర్వ‌హించిన లెక్కింపు మొద‌లైంది. భారీ ఎత్తున జ‌నం వ‌స్తార‌న్న అభిప్రాయంతో జాత‌ర‌లో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. మొద‌టి రోజు 125 హుండీల‌ను మాత్రం లెక్కిస్తే….రూ.2,49,65,000/- ఆదాయం లభించినట్లు వెల్లడించారు. లెక్కించిన నగదును పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరచి తాళాలు వేసి ఉంచినట్లు తెలిపారు. నాణేల లెక్కింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *