
- తగ్గేదేలే…..ప్రభుత్వం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరం నడి బొడ్డు నుంచి ప్రవహించే మూసీ ప్రాజెక్టు సుందరీకరణపై ప్రభుత్వం తగ్గేదేలేదన్న చందంగా సంకేతాలు ఇస్తోంది. తొలివిడతలో చేపట్టే ప్రాజెక్టుపై మరోకీలక ప్రకటనను అధికారులుచేశారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డివిజన్ పరిధిలో మూసీసుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సేకరిస్తున్న భూములను దశల వారిగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనిచెప్పారు. ఇప్పటికప్పుడే సేకరణ పనులు పూర్తి కావని, దశల వారిగా సంప్రదింపులు జరిపి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మూసీ సుందరీకరణ పనుల్లోభాగంగా కొన్ని నెలలుగా పరివాహక ప్రాంతంలోని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నారు. అయినాప్రభుత్వం కొంత మందిని అక్కడి నుంచి తరలించడంలో విజయవంతం అయింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో భాపు ఘాట్ సమీపంలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును బాపూ ఘాట్ సమీపంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో ఇప్పుడు బాపు ఘాట్ కు అతి సమీపంలో మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన మధు పార్క్ రిడ్జ్ ఆపార్ట్ మెంట్ వ్యవహారం వివాదస్పందంగా మారుతోంది. మధు రిడ్జ్ ఆపార్ట్ మెంట్ వాసులు ఆందోళనలు మొదలు పెట్టారు. దీంతో ఆందోళన మరింత సీరియస్ గా మారుతోంది.

పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అధికారులను రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ జరుగదనే సంకేతాలు ఇస్తున్నారు. అయినా ప్రభుత్వం నిర్దేశించిన విదంగా భూసేకరణ చేస్తామన్నారు. అందులో భాగంగా వచ్చే నిర్మాణాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. మధు పార్క్ ఆపార్ట్ మెంట్ పై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ అపార్ట్ మెంట్ కూడా బఫర్ జోన్ లోనే ఉందని స్పష్టం చేశారు.2004 లో అనుమతులు తీసుకున్నసమయంలో 12 మీటర్ల బఫర్ జోన్ గా ఉంటే 2012 నాటికి 50 మీటర్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు. అప్పట్లో అనుమతులతోనే నిర్మాణాలు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు. మార్కెట్ రేట్ చెల్లించి ఆపార్ట్ మెంట్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.రాజేంద్రనగర్ డివిజన్లోని కిస్మత్పూర్, దర్గా ప్రాంతాలలో మూసీ ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈప్రక్రియలో భాగంగా మూసీకి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.





Leave a Reply