

కవితకు భారీ ఊరట
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసును కోర్టు కొట్టి వేసింది. కేసు విచారిస్తున్న సిబీఐ కోర్టు ఈ కేసులో అధికారులు స్కాం జరిగిందనేందుకు ఖచ్చితమైన ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసలో 23 మంది నిందితులు తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యా ధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరు నెలలకు పైగా తెలంగాణా జాగృతి అధ్యక్షు రాలు కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నారు. బేయిల్ పై విడుదలైన అనంతరం కేసు విచారణ సందర్బంగా కోర్టు ఈరోజు కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు పై కవిత మరి కాసేట్లో మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఈ కేసలో ఢిల్లీ లో గతంలో అధికారంలో ఉన్న ఆప్ కీలకనేతలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియాలుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాతే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు మొదలైంది. ఆతరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో విజయం సాధించింది. అయితే కవిత జైలు వెళ్లి బేయిల్ పై వచ్చిన తరువాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. బీఆర్ ఎస్ పార్టీ పై ఆమె చూసిన విమర్శలతో బీ ఆర్ ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గతంలో ఆమె మొదలు పెట్టిన తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో కవిత రాజకీయ పార్టీ తెలంగాణాలో పురుడు పోసుకోనుంది.

లిక్కర్ పాలసీ కేసు- పరిణామాలు…
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ పాలసీ కేసులో అన్ని 23 మంది నిందితులకు విముక్తి
మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆప్ నాయకుడు మణీష్ సిసోడియాలకు క్లీన్ చీట్
ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు ఇచ్చారు.
సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానం.
వేలాది పేజీల చార్జ్షీట్లో సాక్ష్యాలతో మద్దతు లేని అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
చార్జ్షీట్లో “misleading averments” మరియు అంతర్గత విరుద్ధతలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్య.
మణీష్ సిసోడియాపై ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం.
కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని కోర్టు వ్యాఖ్యానం.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని కోర్టు అభిప్రాయం.
ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్పై కూడా స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్య.
సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశం.
మణీష్ సిసోడియా సుమారు 530 రోజులు జైలులో ఉన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ సుమారు 156 రోజులు జైలులో గడిపారు.
2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.
పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలు.



Leave a Reply