NewsInn

News in a Click

భారీ స్కోరు దిశ‌గా భార‌త్

ఫైన‌ల్ మెరిసిన అభిషేక్

వ‌రుస‌గా మూడోసారి సంజు హాఫ్ సెంచ‌రీ

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్)

ఐసీసీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రూప్, లీగ్ ద‌శ‌ల్లో నిరాష ప‌రిచిన అభిషేక్ ఫైన‌ల్ లో ఓ మెరుపు మెరిశారు. కీల‌క మ్యాచ్ లో అభిషేక్ త‌న ఇన్నింగ్స్ తో భార‌త్ భారీ స్కోరు సాధించేందుకు అనుగుణంగా బ్యాటింగ్ లో బాట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. తొలిసార ఇండియ‌న్ ఓపెన‌ర్లు ఈ మ్యాచ్ లో తొలి సారి మొద‌టి వికెట్ కు శుభారంభం అందించారు. అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్ లు ప‌వ‌ర్ ప్లేలోనే న్యూజీలాండ్ బౌల‌ర్ల పై విధ్వంసం సృష్టించారు.

7.1 వ‌ర్ల‌లో 98 ప‌రుగులు సాధించారు. అక్క‌డ తొలి వికెట్ రూపంలో అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యారు ఆలోపే న్యూజీలాండ్ బౌల‌ర్ల‌పై పూర్తి ఆధిప‌త్యం చలాయించారు.21 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 52 ప‌రుగులు సాధించారు. 6 ఫోర్లు, 3 సిక్స్ ల స‌హాయంతో చేశారు. అభిషేక్ ఇన్నింగ్స్ కు పోటీగా సంజు శాంస‌న్ మ‌రోసారి ఫైన‌ల్ లో వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్ ఔట‌యిన త‌రువాత ఇషాన్ కిష‌న్ బ్యాటింగ్ కు వ‌చ్చి అభిషేక్ బాట‌నే అనుస‌రించారు. న్యూజీలాండ్ బౌల‌ర్ల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా భారీ ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో స‌క్సెస్ అయ్యారు.

30 బంతుల్లో సంజు, ఇషాన్ 30 బంతుల్లో 63 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 14 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త్ జ‌ట్టు ఒక్క వికట్ న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. ఫోర్లు, సిక్స్ లతో అహ్మ‌దాబాద్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *