
తెలంగాణాకు నాలుగో ట్రైన్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణకు నాలుగో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సుదీర్ఘ ప్రాంతాలను కలిపే విధంగా ఈ ట్రైన్లను భారత రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది.. ఈ నెల 13వ తేదీ నుంచి కామాఖ్య కు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రానుంది. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్ర కామాఖ్య , చర్ల పల్లి మధ్య స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో కొత్త అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అందబాటులోకి రానుంది.ఈ ట్రైన్ తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అసోం రాష్ట్రంతో రవాణా సేవలను అందించనుంది. రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు మరియు నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
చర్లపల్లి నుంచి నాగర్ కోయిల్ కు మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్


Leave a Reply