
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో గురువారం నుంచి 14 వ తేదీ వరకు ఊష్ణోగ్రతలు, ఉక్కపోత పెరగనుంది. రోజు వారి ఊష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు రోజులు ఉపశమనం కల్పించిన ఎండ వేడిమి…మరోసారి తీవ్రత చూపించనుంది. హైదరాబాద్ లో 37 నుంచి 38 డిగ్రీల వరకు తెలంగాణా లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 14వ తేదీనుంచి వాతావరణలో మార్పులు చోటు చేసుకుంటాయని 16, 17 తేదీల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరిక చేశారు.

Leave a Reply