NewsInn

News in a Click

మాజీ మంత్రి ‘మ‌ల్లారెడ్డి’కి మ‌ళ్లీ పెళ్లి……!

  • ఐదు రోజులు పెళ్లి వేడుక‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

స‌క్సెస్ ఫుల్ వ్యాపార వేత్త‌, ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల అధినేత‌, మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లేటు వ‌య‌సులో మ‌ళ్లీ పెళ్లి అని అనుమానం వ‌స్తుందా….కాని నిజ‌మే…మ‌ల్లారెడ్డి మ‌ళ్లీ పెళ్లి పీఠ‌లెక్క‌బోతున్నారు. ఐదు రోజుల పాటు పెళ్లి బాజాలు మ‌ల్లారెడ్డి ఇంట మోగ‌నున్నాయి. పెళ్లి కొడుకు మ‌ల్లారెడ్డే అవున‌వును…ఇంకా మీకు అనుమాన‌మే క‌దా…అవ‌నండీ మ‌ల్లారెడ్డే మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కూతురు కూడా మ‌ల్లారెడ్డి స‌తీమ‌ణి క‌ల్ప‌న గారే….. మ‌ళ్లీ పెళ్లి ఎంద‌కనేది క‌దా మీ అనుమానం.

ఈ మాజీ మంత్రి పెళ్లి చేసుకుని 50 ఏళ్లు అవుతుంద‌ట‌. అప్ప‌ట్లో ఇప్పుడున్న హంగు, ఆర్భాటాలు లేకుండా సాదా సీదా పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లిక సంబంధించిన గుర్తులు మ‌ల్లారెడ్డికి ఆయ‌న స‌తీమ‌ణికి మాత్ర‌మే గుర్తుంటాయి. ఇక నేటి రోజుల‌కు అనుగుణంగా ఐదు రోజుల పాటు ఘ‌నంగా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో మ‌ల్లారెడ్డి త‌న పెళ్లిక తానే 50వ పెళ్లి రోజు సంద‌ర్భంగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన మ‌ల్లారెడ్డి మ‌రోసారి త‌న స‌తీమ‌ణిని వివాహం చేసుకునేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

పెళ్లికి ముందు ఈ రోజుల్లో బ‌డాబాబులు నిర్వ‌హించ‌కుంటున్న హ‌ల్దీ, మెహందీ, సంగీత్ లాంటి కార్య‌క్ర‌మాల‌ను ఐదు రోజుల పాటు త‌మ పెళ్లి జ‌రిగి 50 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసి త‌మ గోల్డ‌న్ జూబ్లీ దాంపత్యానికి గుర్తుగా భారీ ఎత్తున కుటుంబ స‌భ్యులు, అభిమానుల మ‌ధ్య జ‌రుపుకోవాల‌ని ఏర్పాట్లు చేసుకున్నారు. త‌మ గోల్డెన్ జూబ్లీ పెళ్లికి రావాల‌ని మాజీ సీఎం కేసీఆర్ ను క‌లిసి ఆహ్వానాన్ని అందించారు.

ఈ సంద‌ర్భంగా మెడ్చల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌ను మ‌ల్లారెడ్డి మొద‌లు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన కేటిఆర్ మ‌ల్లారెడ్డికి పెళ్లిపై ఓ జోక్ కూడా వేశారు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌లు త‌మ పెళ్లి సంద‌ర్భంగా విరోష్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన‌ట్లే మ‌ల్ప‌న అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ద‌రు. యువ‌కుల మాదిరిగానే ఏమాత్రం జోష్ త‌గ్గ‌ని మ‌ల్ల‌న్న ఈ నెల 19వ తేదీన త‌న గోల్డెన్ జూబ్లీ వివాహ వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా రాజకీయ నేతలందరినీ ఆహ్వానించారు. సినీ ప్రముఖులతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలువురు ప్ర‌ముఖుల‌ను అహ్వానించారు. మార్చి 14వ తేదీన మల్లారెడ్డి సంగీత్‌ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్లు కేటిఆర్ ప్రకటించారు.

కొన్ని రోజుల క్రిత‌మే మ‌నువ‌రాలి పెళ్లిలో డ్యాన్స తో ఇర‌గ దీసిన మ‌ల్ల‌న్న త‌న పెళ్లి రోజు సంద‌ర్భంగా అంత‌కంటే జోష్ తో డ్యాన్స్ చేయాల‌ని ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంగీత్ లో త‌న డ్యాన్స్ ద్వారా ఇర దీసేలా మ‌ల్లారెడ్డి కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయ‌డం అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతోంది. మ‌ల్ల‌న్న చేసుకునే మ‌ళ్లీ పెళ్లికి అతిథులు కూడా భారీగా హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది.

మల్లారెడ్డి  క్యాంపస్ లో శివరాత్రి రోజు ఏం జరిగిందో తెలుసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *