NewsInn

News in a Click

కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం

సీఎం పదవి కోసం పొటా పోటీ

(పొలిటికల్ డెస్క్, న్యూస్ ఇన్)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం అధికార మార్పిడి సంక్షోభం తార స్థాయికి చేరుకుంది. పార్టీలో అంతర్గత సంక్షోభంతో పార్టీ పెద్దలు దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు డీకే శివకుమార్ విస్తృతంగా శక్తియుక్తులను వినియోగించారు. కానీ సిద్ధరామయ్య క్లీన్ ఇమేజ్ ఆయనకు అప్పట్లో పదవి కట్టబెట్టేలా చేసింది. అదే సమయంలో సీఎం పదవి ఇద్దరు చేపట్టాలన్న అవగాహన వాటి హై కమాండ్ కుదిరించింది.

ముందుగా సిద్ధి రామయ్యకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. దాదాపు సగం ప్రభుత్వ కాలపరిమితి ముగియడంతో ముఖ్యమంత్రి పదవి ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాలని డీకే శివకుమార్ పావులు కలపడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా పార్టీ అంతర్గత వేదికలపై చర్చ జరుగుతుండడం…. తాజాగా రచ్చకెక్కడంతో డీకే వర్గం తమ నేతను సీఎం చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. డికెను సీఎం చేయకపోతే పరిస్థితులు దిగజారి పోతాయన్న హెచ్చరికలను పరోక్షంగా ఆ వర్గం నేతలు చేస్తున్నారు.

శాసనసభ్యులు కూడా పార్టీ అంతర్గత సంక్షోభంతో పలు వర్గాలుగా విడిపోయారని తెలుస్తుంది. పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అంతుచిక్కని వ్యవహారంగా కన్నడ రాజకీయాల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని బిజెపి నిరంతరం పర్యవేక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలది హై కమాండ్ ది ఒకదారి అయితే తన దారి తాను చూసుకుంటానన్న సంకేతాలు గత కొన్ని రోజులుగా డీకే శివకుమార్ ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కుంభమేళాకు దూరంగా ఉన్నా శివకుమార్ మాత్రం అక్కడికి వెళ్లి వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవన్నీ కాంగ్రెస్ కు హెచ్చరికలే అని డీకే వర్గం తేల్చి చెబుతోంది.

మరోవైపు ఐదేళ్లు తానే సీఎం గా ఉంటారని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కన్నడ రాజకీయాల్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు కర్ణాటక రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పరిస్థితులు ఎలా చక్కదిద్దుతారన్నది ఇప్పుడు అందరిలో వెంటాడుతున్న ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *