
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్అమ్మకం ద్వారా 602.06 కోట్ల రుపాయాల ఆదాయాన్ని ఈ ఆర్ధిక సంవత్సరం సంపాదించింది. ‘మిషన్ జీరో స్క్రాప్ లో భాగంగా ….. ఈ మోడ్ ప్రకారం ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు స్క్రాప్ (తుక్కు)నిల్వలు పేరుకుపోకూడదనే నిబంధనలను రైల్వే అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025-26కిగాను రైల్వే బోర్డు నిర్దేశించిన రూ.510.00 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి స్క్రాప్ అమ్మకం ద్వారా రూ.602.06 కోట్లు ఆర్జించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ డిపోలలో పేరుకుపోయిన స్క్రాప్ను సేకరించి 1,32,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్ను విక్రయించింది. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకం ద్వారా రూ.501.72 కోట్లకు విక్రయించగా ఈ సంవత్సరం అదనంగా రూ.100 కోట్లకు పైగా అధిగమించి రైల్వేలలో స్క్రాప్ అమ్మకాలలో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మిషన్ జీరో స్క్రాప్ లో నిర్దేశించిన లక్ష్యాన్నిఅధిగమించడంతో స్టోర్స్ విభాగం చేసిన కృషిని అభినందించారు.


Leave a Reply