
- బయటపెట్టిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీ గురించి ఓ ఆసక్తి కరమైన విషయాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయట పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సహచర ఎంపీలతో కలిసి పార్లమెంట్ భవనంలోని పబ్లికేషన్ డిపార్ట్ మెంట్ వెళ్లిన ఎంపీలు పార్లమెంట్ సభ్యుల కు మాత్రమే ముద్రించి ఇచ్చే హు ఈజ్ హు అనే పుస్తకంలో ఎంపీ ల వ్యక్తిగత వివరాలు పొందు పరుస్తారు. వారి వ్యక్తి గత వివరాలతో పాటు హాబీలు, విదేశీ పర్యటనలు, విద్యార్హతలు, కుటంబ వివరాలు లోకసభ సభ్యులు అందించిన సమాచారం మాత్రమే ఆ పుస్తకం లో ముద్రిస్తారు. ఎంపీ ల గురించి తెలియచేసే పుస్తకం. ఈ విడత లోక్ సభలో లోక్ సభ సభ్యల గురించి వారి వ్యక్తి గత వివరాలు వారితో సేకరించి ఆ పుస్తకాన్ని సిద్ధం చేస్తారు. రాష్ట్రానికి చెందిన ఒక్కో ఎంపీ గురించి చెప్పుకుంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు రాహూల్ గాంధీ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని చెప్పి రాహూల్ గాంధీ గురించి ముద్రించిన పేజీ వరకు వెళ్లారు. ఆ పేజీలో ఆయన వ్యక్తి గత వివరాలతో పాటు ఆసక్తి ఉన్న అంశాల ను చదివి వినిపించారు.

రాహూల్ ప్రొఫెషన్ వృత్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాహూల్ గాంధీ ప్రొఫెషన్ సూచించే దగ్గర స్ట్రాటజీ కన్సల్టెంట్ అని రాసి ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుస్తకంలోని ఆ పేజీని చూపిస్తూ చదివి వినిపించారు. అయితే రాహూల్ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీకా…దేశానికా తరువాత మాట్లాడుతా అంటూ పార్లమెంట్ క్యాంటీన్ లో ఆ పుస్తకాన్ని ఎంపీ కోండా విశ్వేశ్వర్ రెడ్డి మూసారు.


Leave a Reply