NewsInn

News in a Click

యాద‌గిరి గుట్ట‌కు గ‌వ‌ర్న‌ర్ శుక్లా దంప‌తులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శివ‌ప్ర‌తాప్ శుక్లా దంప‌తులు గురువారం యాద‌గిరి గుట్ట లక్ష్మి న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజ స్తంభం వద్ద మొక్కి స్వామి వారి అంతరాలయం లో అర్చన చేయ‌డంతో పాటు ప్ర‌త్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం కార్య నిర్వాహణాధికా స్వామి వారి మెమొంటోను అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామి వారి ప్రసాదాన్ని గవర్నర్ కు అందచేశారు. అనుబంధ దేవాలయం శ్రీ పర్వత వర్ధిణి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో స్పటిక లింగానికి గవర్నర్ దంపతులు అభిషేకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *