NewsInn

News in a Click

తాండూరు లో టేక్ఆఫ్ కు సిద్ధమవుతున్న పైలట్

తాండూరు లో టేక్ఆఫ్ కు సిద్ధమవుతున్న పైలట్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో టేక్ ఆఫ్ కు సిద్ధమవుతున్నారు.పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదన్న షరతును సడలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాండూర్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలైంది.

పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, గతంలో విధించిన బెయిల్ షరతుల్లో ఒకటైన ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదనే నిబంధనను సడలించింది. దర్యాప్తులో కీలక భాగం ఇప్పటికే పూర్తయిందని, తాను తన నియోజకవర్గంలోనే నివసిస్తున్నానని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.వాదనలు విన్న న్యాయస్థానం ఆ షరతును సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మిగిలిన అన్ని షరతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజల మధ్యకు రానుండటంతో తాండూర్ లో మ‌రోసారి రాజ‌కీయం వేడెక్క‌నుంది.

కొన్ని రోజుల క్రితం డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌డంతో పార్టీ ఆదేశాల మేర‌కు పైలెట్ సైలెంట్ గా ఉన్నారు. ఇక కోర్టు నుంచి ఉప‌శ‌మ‌నం ద‌క్క‌డం… ఇదే కేసులో ప‌ట్టుబ‌డ్డ మ‌రో ఎంపీ పుట్టా మ‌హేష్ కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుండ‌డంతో ఇక రోహిత్ రెడ్డి కూడా ప్ర‌జల్లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆషాఢ మాసం కావ‌డంతో…అధికారికంగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోయినా త‌న నివాసంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుసుకునే అవ‌కాశం ఉంది. ఈ నెల పూర్త‌యిన త‌రువాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొనే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *