NewsInn

News in a Click

గ్యాస్ బ్లాక్ మార్క‌ట్ కాకుండా చూడండి

  • గృహ వినియోగ‌దారుల‌కు ఇబ్బంది లేదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో LPG నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం సచివాలయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష చేశారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజు వారి సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఎజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయిని, ప్రస్తుత డిమాండ్ కు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు కు డిమాండ్ మేరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *