NewsInn

News in a Click

కర్ణాటకపై కాంగ్రెస్ పెద్దల ఫోకస్

కలిసాము…కలిసే ఉన్నాము

అసెంబ్లీ వ్యూహంపై చర్చించాము

సిద్దు,డీకే ల వెల్లడి

(పొలిటికల్ డెస్క్,న్యూస్ ఇన్)

కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరరపడేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ హై కమాండ్ సూచనల మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు బ్రేక్ ఫాస్ట్ మీట్ లో కలిసారు. దాదాపు గంటసేపు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత మీడియా ముందుకు కలిసి వచ్చిన ఆ ఇద్దరు నేతలు తమ
మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏ ఒక్కరు చెప్పలేదు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తో కలిశాము….కలిసే నడుస్తాం.. అంతా హై కమాండ్ చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం పైనే బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో చర్చించడం జరిగిందని నేతలు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా బ్రేక్ ఫాస్ట్ మీట్ సందర్భంగా నే చర్చకు వచ్చిందని నేతలు వ్యాఖ్యానించారు. సిద్దు,డీకేల మధ్య విభేదాలని మీడియా సృష్టి మాత్రమే అని ప్రియాంక ఖర్గే తేల్చి చెప్పారు. మీడియాలో రేటింగుల కోసమే వార్తలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు… అయితే పార్టీ హై కమాండ్ కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్చలు మొదలుపెట్టారు. కీలక నేతలను ఢిల్లీ రమ్మని సమాచారం అందించారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తన పదవిని కాపాడుకోవాలని పట్టుదలతో ఉండగా…. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విడతలోనే ముఖ్య మంత్రి పదవి దక్కించుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారని కన్నడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *