
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బ్రదర్స్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.బీఆర్ ఎస్ పార్టీ కూడా అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేయకపోయినా… మాదక ద్రవ్యాల వినియోగం ఎవరు చేసినా నేరంగా నే తాను భావిస్తానని కేటిఆర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వ్యక్తం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో తొందర పాటు వద్దన్న అభిప్రాయంతో బీఆర్ ఎస్ ఇంకా వేచి చూసే దోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అవకాశం అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం మొదలు పెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నా నేపథ్యంలో బీఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తూ…అసెంబ్లీ సమావేశాల సందర్బంగా డ్రగ్ టెస్టులు చేసుకుని అసెంబ్లీకి హాజరు అవుదామన్న వాదనను కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది. అయితే….. పార్టీ విషయం ఎలా ఉన్నా….ఈ ఘటనలో పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ ఓ వీడియోను విడుదల చేశారు.
వీడియోలో శ్రీశైల్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు…
- హైడ్రా, మూసీ, అటకెక్కిన ఆరు గ్యారంటీలు, యూరియా కొరత, అందని రైతు బంధు, జరగని రుణమాఫీ, కరెంట్ కష్టాలు, తిరగబడుతున్న జనం – వీటన్నింటి నుంచి డైవర్షన్ డ్రామా మళ్ళీ మొదలు పెట్టిన కాంగ్రెస్.
- అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజే ఎదురు దాడి వ్యూహం.
- రోహిత్ రెడ్డి డ్రగ్స్ మాఫియా అనడం బంజేసి తాండూరు ప్రజల గోస పట్టించుకోండి మనోహర్ రెడ్డి గారూ.
- చట్టం తన పని తాను చేసుకుని పోనివ్వండి. ఇన్ఫ్లుయెన్స్ చేయకండి.
- ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కిడ్నాప్ చేసిన చరిత్ర కాదు మాది.
- కేసీఆర్ నేతృత్వంలో తాండూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు రోహిత్ రెడ్డి.
- తాండూరు ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి, కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టాలి.
- నిరంతరం ప్రజాపక్షం వహించి, కేసీఆర్ గారి పాలన మరలా తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.
- మబ్బులు తొలగిపోతయి, ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటామని ప్రకటించారు.






Leave a Reply