ప్రతిపక్షానికి బలం పెరుగుతుందన్న పండితులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు నూతన సంవత్సర వేడుకులను తెలంగాణా భవన్ లో నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ఈ, పలువురు నేతలు ఉగాది వేడకులకు హజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన పంచాశ్రవణంలో పండితుల అభిప్రాయాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి….
ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయి
విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది
యువత పక్కదారి పడే అవకాశం ఉందని ఆందోళన

ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం
అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముంది
ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయి
ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయి
బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చు
అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవాన్ని పొందుతుంది
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి,విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం.
తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం
రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు
సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశం
కేటిఆర్ సీఎం రేవంత్ కు పెట్టిన కొత్త పేరు తెలుసా……









Leave a Reply