
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. వేసవి ప్రారంభంలోనే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఏటా ఈ సమయంలో వచ్చే అకాల వర్షాలతో ఒక్క సారిగా పరిస్తితి చల్లబడింది. గత మూడు రోజులుగా వేసవి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చేతికందుతున్న పంటలు వర్షాల ప్రభావంతోనే దెబ్ తినడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు మూడు రోజులు కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.









Leave a Reply