(హైదరాబాద్, న్యూస్ఇన్)

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొంతమందిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై అభియోగాలు మోపుతూ ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. రూ. 2 వేల కోట్ల ఆస్తులను నిందితులు కుట్రపూరితంగా కైవసం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది. వీరితో పాటు యంగ్ ఇండియా సంస్థ, డోటెక్స్ మెర్చండైజ్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) తదితర సంస్థలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ కక్షసాధింపు అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.



Leave a Reply