NewsInn

News in a Click

మత్స్యకారులు వేటకు వద్దు

(అమరావతి, న్యూస్ఇన్)

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతున్న తీవ్రవాయుగుండం.


మధ్యాహ్నానంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఈ ప్రభావంతోనెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణకోస్తా తీరం వెంబడి 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *