(అమరావతి,న్యూస్ఇన్)
ఎచ్చెర్ల మండలం వద్దకు అనుమానాస్పద పడవ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానిక మత్స్యకారులు గుర్తించారు. సముద్రంలో పడవ చెడిపోయిన తర్వాత 20 రోజులుగా కొట్టుకుపోతున్న 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు ఈ పడవలో ఉన్నారు.

ఈ సమాచారం స్థానిక మత్స్యకారులు మెరైన్ పోలీసులకు అందించారు. పోలీసులు పడవలోని 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలసిపోయిన వారికి స్థానికులు ఆహారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.






Leave a Reply