(హైదరాబాద్, న్యూస్ఇన్)
అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్ లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అధినేత ఆదేశించారు.
పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను అధినేత కేసీఆర్ గారు అప్రమత్తం చేశారు.
అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కెసిఆర్ గారు ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కెటిఆర్, హరీష్ రావు, వినోద్ మరియు జిల్లా నేతలతో కెసిఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచిస్తున్నారు.కాగా.. ఆరోగ్య సమాచారాన్ని,. మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని డాక్టర్లు కెసిఆర్ తెలుసుకుంటున్నారు.












Leave a Reply