NewsInn

News in a Click

ఐపీఎల్ -19 సీజ‌న్ లో ఆర్సీబీ శుభారంభం

ఐపీఎల్ -19 సీజ‌న్ లో ఆర్సీబీ శుభారంభం

స‌న్ రైజ‌ర్స్ పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం

(స్పోర్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఐపీఎల్ -19 సీజ‌న్ శ‌నివారం బెంగుళూరులో ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. సీజ‌న్ తొలి మ్యాచ్ కావ‌డంతో క్రికెట్ ప్రేమికులు ఈమ్యాచ్ ను పెద్ద ఎత్తున వీక్షించారు. డిపెండింగ్ ఛాంపియన్ గా బ‌రిలో దిగిన ఆర్సీబీ అందుకు అనుగుణంగానే ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సొంత గ్రౌండ్లో భారీ అభిమానులు మ‌ధ్య ఆర్సీబీ తొలి మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో స‌న్ రైజ‌ర్స్ పై విజ‌యం సాధించింది.

ఆ త‌రువాత 202 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కి ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ఆశించినట్లు ద‌క్క‌లేదు. ఫిల్ సాల్ట్, కోహ్లీలు ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. కుదురుకున్న‌ట్లే క‌నిపించిన ఫిల్ సాల్ట్ 8 ప‌రుగులు 2 ఫోర్లు సాధించి ఔట‌య్యారు. ఆ త‌రువాత బ్యాటింగ్ కు వ‌చ్చిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌పై వీర విహారం చేశారు. 26బంతుల‌ను ఎదుర్కొని 7 ఫోర్లు, 4 సిక్స్ ల‌తో 61 ప‌రుగులు సాధించి భారీ షాట్ కొట్ట‌బోయి ఔట‌య్యారు. మ‌రో వైరు విరాట్ కొహ్లీ నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేస్తూ ర‌న్ రేట్ త‌గ్గ‌కుండ కాపాడుతూ బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నారు. ప‌డిక్క‌ల్ స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చిన ర‌జ‌త్ పాటిద‌ర్ ప‌డిక్క‌ల్ మాదిరిగానే బ్యాటింగ్ కొన‌సాగించారు. 10 ఓవ‌ర్ల‌లోనే 120 కి పైగా ప‌రుగులు ఆర్సీబి సాధించింది.

ప‌డిక్క‌ల్ 12 బంతుల్లో 31 ప‌రుగులు సాధించి స్కోరు 163 ప‌రుగుల వ‌ద్ద 3వ వికెట్ ఆర్సీబీ కోల్పోయింది. జీతేష్ శ‌ర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చి తొలిబంతికే భారీ షాట్ ఆడ‌బోయి ఔట్ కావ‌డంతో మ‌రో వికెట్ కూడా ఆర్సీబీ కోల్పోయింది.జిమ్ సెన్ వేసిన 13వ ఓవ‌ర్ ఆర్సీబీ కి హ‌ర్డిల్స్ సృష్టించింది. కొహ్లీ 33 బంతుల్లో 4 సిక్స్ లు 2 ఫోర్ల‌తో 64 వ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నారు. ఆ త‌రువాత ఒక్క ఓవ‌ర్ లోనే కొహ్లీ గేర్ మ‌ర్చారు. ఫోర్లు, సిక్స్ ల‌తో విరుచుకు ప‌డి ఆర్సీబీకి విజ‌యాన్ని అందించారు కేవ‌లం 38 బంతుల్లోనే 69 ప‌రుగులు సాదించి నాటౌట్ గా నిలిచారు. టీండేవిడ్ 16 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు. 201 ప‌రుగ‌ల ల‌క్ష్యాన్ని 16వ ఓవ‌ర్లోనే ఆర్సీసీ ఛేధించింది. నాలుగో వికెట్లు కోల్పోయి 20 3 ప‌రుగులు 15.4 ఓవ‌ర్ల‌లో చేసింది. ఎస్ ఆర్ హెచ్ బౌల‌ర్లు ఆర్సీబీ బ్యాట‌ర్ల‌ను ఇబ్బందులు పెట్టిన‌ట్లు మ్యాచ్ లో క‌నించ‌లేదు.

క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఐపీఎల్ దూమారం……

ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగులు సాధించింది. స‌న్ రైజ‌ర్స్ ఓపెనింగ్ జోడీ తొలి మ్యాచ్ లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఎంతోమందిని ఊరించిన అభిషేక్ తొలి మ్యాచ్ లో ఒక సిక్స్ కొట్టి వెంట‌నే ఔట‌య్యారు. మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స్ ల‌తో 80 ప‌రుగులు సాధించి ఔట‌య్యారు. ఎస్ఆర్ హెచ్ త‌ర‌పున అనికేత్ వ‌ర్మ కూడా రాణించారు. 18 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్స్ ల‌తో 43 ప‌రుగులు సాధించారు. వీరిద్ద‌రు రాణించ‌డంంతో 20 ఓవ‌ర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగుల స్కోరు ఎస్ ఆర్ హెచ్ సాధించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *