వన్యప్రాణలను ప్రత్యక్షంగా చూసేందుకు రోజు వేలాది మంది జూపార్క్ కు వస్తుంటారు….అడవిలో ఉన్న జంతువులు, వన్యప్రాణులు ఇతర దేశాల నుంచి తెచ్చి పక్షులు లాంటివి జూపార్క్ లో ప్రజలకు రిలీఫ్ ఇస్తుంటాయి. వీటిని చూసేందుకు వచ్చిన వారు ప్రత్యక్షంగా వాటని చూసి ఆనందపడుతారు. చిన్న పిల్లలయితే మరింత ఎంజాయ్ చేస్తారు. సింహాలు, పులులు, పాములు, ఏనుగులు లాంటి అనేక జంతువులు మనం నెహ్రూ జూలాజికల్ పార్క్లో చూడవచ్చు. అయితే త్వరలో మరి కొన్ని జంతువులు జూ పార్క్ లో కనువిందు చేయనున్నాయి.
ఆస్ట్రేలియా నుంచి కంగారులు

ఆస్ట్రేలియా నుంచి కంగారులు నెహ్రూ జూపార్క్కు చేరుకోనున్నాయి. జంతువుల మార్పిడి కార్యక్రమం కింద వంతార ఆస్ట్రేలియా కంగారులను నెహ్రూ జూపార్క్కు ఇవ్వనుంది. ఆడ, మగ కంగారూలను అందించనుంది. ఇవి చేరుకున్న తర్వాత సందర్శకుల కోసం జూపార్క్లో ఉంచనున్నారు. సందర్శనకు ఉంచే ముందు కొన్ని రోజులు వాటిని నిర్బంధంలో ఉంచుతారు. ఈ కంగారూలను ఉంచేందుకు ఇప్పటికే జూపార్క్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ కంగారులకు ప్రతిఫలంగా తన జంబోలలో ఒక దాన్ని వంతారకు జూపార్క్ అధికారులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కూడా ప్రయత్నాలు
2020లో జపాన్లోని యోకోహామా జూలాజికల్ గార్డెన్స్ నుంచి నాలుగు కంగారూలను తీసుకొచ్చేందుకు జూపార్క్ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు రెండు జూల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. కానీ కరోనా వల్ల ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇటీవల హైదరాబాద్ వచ్చిన వంతార టీమ్ నెహ్రూ జూపార్క్ను సందర్శించి కంగారూలను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నెహ్రూ జూపార్క్లో కంగారూలు ఉండటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇక జూపార్క్లోని మగ జిరాఫీ అయిన సన్నీ కోసం త్వరలో ఆడ జిరాఫీని తీసుకురానున్నారు. ఇందుకోసం మైసూర్ జూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆడ జిరాఫీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.






Leave a Reply