NewsInn

News in a Click

ఏపీ సీఎంతో GRMB చైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు గురించి దోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు. గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో రెండు రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు దోర్జే గ్యాంబాకు సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *