NewsInn

News in a Click

రేవంత్ నెక్స్ట్ టార్గెట్ ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వే

రేవంత్ నెక్స్ట్ టార్గెట్ ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ప‌ద‌వి ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డ‌మేన‌ని అందుకే తెలంగాణా కంటే ఢీల్లీ పైనే ఆయ‌న ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నార‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర భార‌త దేశంపై అందుకే ప్రేమ చూపించిన‌ట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏదో వివాదాస్ప‌దం చేసి జాతీయ రాజ‌కీయాల్లో స్థానం సంపాదించేందుకే సీఎం ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఆరోపించారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే డిలీమిటేష‌న్ జ‌రుగుతోంద‌ని, రాజ్యాంగ విరుద్దంగా పున‌ర్విభ‌జ‌న కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌ద‌న్నారు. పున‌ర్విభ‌జ‌న‌పై జాతీయ రాజ‌కీయాలను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకునే య‌త్నాల‌ను రేవంత్ రెడ్డి చేస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సీఎం లేఖ‌లు రాయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ హాయంలో తెచ్చిన నిబంద‌న‌లు అమ‌లు చేస్తే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం కేంద్రం తెస్తున్న విధానంతో ఎలాంటి అన్యాయం జ‌రుగ‌ద‌ని మ‌హేశ్వ ర్ రెడ్డి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *