(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
రాయల్ ఛాలెంజర్స్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో తడబడింది. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడం లక్నో బ్యాటర్లకు సవాల్ గా మారింది. క్రమంగా వికెట్లు క్పలోవడంతో పాటు ఆర్సీబీ ఫీల్డర్ల అద్భుతమైన ఫీల్డింగ్ తో బ్యాట్స్ మెన్లు వెంట వెంటనే పెవిలీయన్ చేరుకున్నారు. 20 ఓవర్లలో 146 పరుగుల సాధించింది ఆర్సీబి ముందు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

ఇన్నింగ్స్ ఆరంభంలో పర్వాలేదని పించే విధంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. లక్నో. 32 పరుగుల వద్ద తొలి వికెట్ ను నాలుగో ఓవర్లో మార్కరం12 పరుగులు ఔటయ్యారు. మరో ఓపెనరల్ మిఛిల్ మార్ష్ క్రీజుల్లో నిలదొక్కుకున్నట్లు కనిపించింది. మార్కరం స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ 35 పరుగుల వద్ద ఔటయ్యరు.7 బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి ఔటయ్యరు. రిషబ్ పంథ్ వచ్చి రావడంతోనే భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్ తో వెంటనే వెనుదిరిగారు.మర్ష్ 3వ వికెట్ రూపంలో 71 పరుగల దగ్గర40 పరుగులు చేసి కృనాల్ పాండ్య బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. అబ్దుల్ సమద్ పరుగులేమి 83 పరుగుల వద్ద చేయకుండానే వెనుదిరిగారు. ఆయుష్ బదోని 24 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి వెనుదిరిగారు. 16 ఓవ ఓవర్లో 118 పరుగుల వద్ద వెనుదిరిగారు.

ఆ తరువాత కూడా వరుసగా లక్నో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును సాధించలేకపోయింది. లిండే, షమీలు 137 పరుగుల వద్దే 18 వ ఓవర్లో వెనువెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరును పెంచుతూ వచ్చిన ముకుల్ చౌదరీ 145 పరుగల వద్ద 39 పరుగులు చేసి ఔటయ్యారు. ముకుల్ 28 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్స్ లతో సాధించారు. మొత్తం 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే ఎల్ ఎస్ జీ చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 3,రసిక DAAR 3 వికెట్లు తీసుకోగా కృనాల్ పాండ్య 2, హేజిల్ ఉడ్ ఒక వికెట్ తీసుకున్నారు.చివరి ఓవర్లను మరింత కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టు బ్యాటర్లు పరుగులు సాధించడానికి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వికెట్లు కూడా కోల్పోయారు.









Leave a Reply