భాగ్యనగర్ పునర్ నిర్మాణ సమితి
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
గ్రేట్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తూ ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ స్థానాలను 300 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను సిద్ధం చేసింది. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి డివిజన్ల సంఖ్య భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిపై అభిప్రాయ సేకరణను మొదలుపెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా లేదన్నది రాజకీయ పార్టీలు ప్రధానంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం పై భాగ్యనగర్ పునర్నిర్మాణ సమితి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వం దృష్టికి పలు డిమాండ్లను తెచ్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అవుతుంది.

ప్రధాన డిమాండ్లు
- తక్షణ ఉపసంహరణ: పూర్తి పారదర్శకత, ప్రజా సంప్రదింపులు జరిగే వరకు 150 నుంచి 300 వార్డుల డీలిమిటేషన్పై ప్రాథమిక నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలి.
- స్వతంత్ర సమీక్ష: డేటా ఆధారితంగా, సమానత్వంతో సరిహద్దులు నిర్ణయించేలా ఒక తటస్థ కమిషన్ ఏర్పాటు చేయాలి.
- జాతీయ డీలిమిటేషన్ పరిరక్షణ: రాబోయే అసెంబ్లీ/పార్లమెంటు పునర్విభజన స్థానిక పక్షపాతాల ప్రభావం లేకుండా జరిగి, స్వేచ్ఛాయుత న్యాయమైన ఎన్నికలను నిర్ధారించాలి.



Leave a Reply