(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలో ఆధార కార్డు ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో ఏ అవసరం వచ్చినా ఆధార్ కార్డుపైనా అంతా ఆధారపడుతున్నారు. ఇలాంటి కీలక మైన ఆధార కార్డులు నకిలీవి తయారు చేస్తూ మోసం చేస్తున్న నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అంబర్ ప్రాంతానికి చెందిన కటికె ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బాగ్ అంబర్ పేటలోని శివం రోడ్ లో ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా పట్టు సాధించడంతో మోసం చేసేందుకు నకిలీ ఆధార్ కార్డులను తయారు చేయడం వ్యాపారంగా మార్చుకున్నారు.

ఆధార్ కార్డులో పేరు, ఫోటోల్లో మార్పులు చేసి ఎవరికి కావాల్సిన విధంగా వాటిని తయారు చేసి నకిలీ కార్డులను సృష్టించారు. పోలీసులకు సమాచారం అందడంతో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రవీణ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రవీణ్ తో పాటు వంశీకృష్ణ, రెడ్డి వాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడంతో నకిలీ ఆధార్ కార్డుల తయారీని అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై బి ఎన్ ఎస్ యాక్ట్ 420, 468,471సెక్షన్త కింద పోలీసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.











Leave a Reply