NewsInn

News in a Click

మంత్రి వ‌ర్గ ‘పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ’ భేటీ

మంత్రి వ‌ర్గ ‘పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ’ భేటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో పాటు శాస‌న‌మండ‌లి స‌భ్యుల విష‌యంలో చ‌ర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్ భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఎన్నిక‌లకు మందు అజ‌హారుద్దీన్ కు కు మండ‌లి స‌భ్యుడిగా నియ‌మించి మంత్రివ‌ర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చోటు క‌ల్పించారు. మైనార్టీల‌కు ప్రాతినిథ్యం లేద‌న్న ఆరోప‌ణ‌ల‌కు అజ‌హారుద్దీన్ కు అవ‌కాశం క‌ల్పించి చెక్ పెట్టారు. మంత్రి వ‌ర్గంలో అజ‌హారుద్దీన్ కొన‌సాగాలంటే ఉభ‌య స‌భ‌ల్లో ఏదో ఒక స‌భ స‌భ్యుడిగా ఆరు నెల‌ల్లోపు అవ‌కాశం ద‌క్కించుకోవాలి. శాస‌న‌స‌భ‌లో అవ‌కాశం ద‌క్క‌దు….దీంతో ఇక ప్ర‌త్యామ్నాయం శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా ఎన్నిక కావ‌డ‌మే. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో గ‌వ‌ర్న‌ర్ కోటాలో నియామకాల‌పై న్యాయ ప‌ర‌మైన చిక్కులు కొన‌సాగుతున్నాయి. బీఆర్ ఎస్ నియ‌మించిన ఇద్ద‌రు నేత‌ల‌కు శాస‌న‌మండ‌లికి అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో….రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో వారి స్థానంలో మ‌రో ఇద్ద‌రిని నియ‌మించి కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించింది. ఇది సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్ట‌డంతో వారు కూడా ప‌ద‌వులు కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం అజ‌హారుద్దీన్ కు కేటాయించ వ‌చ్చ‌న్న అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి అవ‌కాశం క‌ల్పించారు. కానీ ఈ కేసు విష‌యంలో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు.

అజ‌హారుద్దీన్ మంత్రిగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ నెల 30వ తేదీలోపు ఈకేసు కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో మైనార్టీ మంత్రి ప‌ద‌వి డోలాయ‌మానంలో ప‌డ‌తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అయినా ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. గ‌డ‌వు స‌మీపిస్తుండ‌డంతో..ఇక అజ‌హారుద్దీన్ ను క్యాబినెట్లో కొన‌సాగించాలంటే ప్ర‌భుత్వానికి రెండు అవ‌కాశాలుంటాయి. మొద‌టి అవ‌కాశం శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా ఎంపిక చేయ‌డం, రెండో అవ‌కాశం ఆరు నెల‌ల‌కు ఒక రోజు ముందు రాజీనామా చేసి తిరిగి మంత్రిగా మ‌రోసారి ప్ర‌మాణ స్వీకారం చేయించ‌డం. ఇలా చేసినా మ‌రో ఆరు నెల‌లు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో శాశ్విత ప‌రిష్కారం దిశ‌గానే సీఎం రేవంత్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

హై క‌మాండ్ గ్రీన్ సిగ్న‌ల్…..

అందులో భాగంగానే గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాతో ఈ ప‌రిస్థితులు వివ‌రిస్తూనే త‌దుప‌రి చర్య‌లు చేప‌ట్టేందుకు సీఎం రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.దీంతో పాటు మంత్రి వ‌ర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భ‌ర్తిపై కూడా సీఎం దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ప‌లు మార్లు ఢిల్లీ వెళ్లిన సంద‌ర్బంగా సీఏం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకునేంద‌కు అనుమ‌తి పొందిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే నెల 10వ‌తేదీలోపు మంత్రి పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ కూడా పూర్త‌వుతుంద‌న్న టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఒక్క‌రిద్ద‌రు మంత్రుల‌ను తొల‌గించి, కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించడంతో పాటు ఎన్నిక‌ల టీంను ఇప్ప‌టి నుంచే సిద్ధం చేయాల‌ని సీఎం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్ తే భేటీ సంద‌ర్బంగా ఈ అంశాల‌ను సీఎం చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. సీఎం తో పాటు శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు, రాజ్య‌స‌భ స‌భ స‌భ్యుడు వేం న‌రేందర్ రెడ్డిలు మాత్ర‌మే ఉండ‌డంతో క్యాబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగి ఉంటుంద‌న్న అభి ప్రాయం అధికార పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతున్నాయి.

గ‌వ‌ర్న‌ర్ తో భేటీ పై సీఎంఓ ప్ర‌క‌ట‌న …..

విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై సీఎంతో చర్చించిన గవర్నర్.

విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించిన గవర్నర్

ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలన్న గవర్నర్

జూన్ 12 న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో చర్చించిన గవర్నర్.

పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని సూచించిన గవర్నర్.

గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *