(హైదరాబాద్,న్యూస్ఇన్)
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్తరైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించారు.

ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటుగా భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు.
కొత్త రైళ్లు వాటి సమయం…..
- 17607/17608 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30కు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 15 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17601/17602 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 జూలై, 2026 నుంచి ప్రారంభం కానుంది
- 17047/17048 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 7 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17441/17442 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17443/17444 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 15మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17059/17060 నెంబరుతో ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 11 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17067/17068 నెంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. 5 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17079/17080 నెంబరుతో ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైళ్ల ప్రారంభాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైళ్లను ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే మంత్రి ఆమోదం తెలియచేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
- వేసవి ప్రత్యేక రైళ్లు….








Leave a Reply