NewsInn

News in a Click

మ‌ల్లారెడ్డి@బీఆర్ఎస్@బీజేపీ- హాట్ హాట్

మ‌ల్లారెడ్డి@బీఆర్ఎస్@బీజేపీ- హాట్ హాట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర రాజ‌కీయాల్లో అనూహ్యంగా మాస్ లీడ‌ర్ గా ఎదిగిన మ‌ల్లారెడ్డి దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న ల‌క్ష్యంగా తన రాజ‌కీయ అనుభ‌వంతో కుటుంబ సభ్యుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు..వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. స‌హ‌జంగా వ్యాపార వేత్త నుంచి విద్యా వాపార వేత్త‌గా ఎదిగిన మ‌ల్లారెడ్డికి రాజ‌కీయ రంగం కూడా క‌లిసి వ‌చ్చింది. తొలిసారిఎంపీగా పోటీ చేసి టీడీపీ నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న ఆ త‌రువాత మారిన ప‌రిస్థితుల‌తో గులాబీ గూటికి చేరుకున్నారు. తొలిసారి ఎంపీగా రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించి ఆ వెంట‌నే గులాబీ పార్టీలో క్యాబినెట్లో చోటు ద‌క్కించుకున్నారు. బ‌హిరంగా మ‌ల్లారెడ్డి చేసే వ్యాఖ్య‌లు హ‌స్యాస్ప‌దంగా ఉన్నా….వాస్త‌వంగా అ వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచింప చేస్తాయి కూడా. ఎంపీగా ఉన్న స‌మ‌యంలోనే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని, మంత్రిని అవుతాన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసి అన్నంత ప‌ని చేసి చూపించారు. ఆ త‌రువాత మ‌రోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించినా రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయ‌న ప్ర‌తిప‌క్ఫ నేత‌గా మిగ‌ల‌క త‌ప్ప‌లేదు.

ఆయ‌న విద్యా, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవ‌లంటే అధికార పార్టీల రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు స‌హ‌క‌రిస్తే త‌ప్ప ఆయ‌న వ్యాపారాల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు.ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ల్లారెడ్డిలోని రాజ‌కీయ నేత కాకుండా వ్యాపార వేత్త అప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక వ్యాపార‌వేత్త‌గా చ‌క్రం తిప్పి సీఎం రేవంత్ తో స‌యోధ్యతో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించారు. త‌న మ‌న‌వ‌రాలి పెళ్లికి సీఎం రేవంత్ ను ఆహ్వానించి త‌న మ‌న‌వ‌ళ్ల‌తో రేవంత్ రెడ్డికాళ్లు మొక్కించారు. ఇదంతా రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌ల్ల‌న్న వ్యాపార వేత్త‌గా చ‌క్రంతిప్పుతున్న వ్య‌వ‌హారం….ఇక కేంద్రంతో స‌యోద్య కోసం మ‌రో అస్త్రాన్ని మ‌ల్ల‌న్న బ‌య‌ట పెట్టారు. త‌న కోడ‌లు ప్రీతి రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్న సంకేతాలు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చారు. అదే స‌మ‌యంలో మారో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో నూ సంప్ర‌దింపులు జ‌రిపారు. క‌ర్నాట‌క ఉప‌ముఖ్య‌మంత్రి డీకే తో చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి సానుకూల వాతావ‌ర‌ణ క‌నిపించ‌డంతో కాంగ్రెస్ ను రాష్ట్ర అవ‌స‌రాల వ‌ర‌కే ఉంచుకోవాల‌న్న అభిప్రాయానికి వ‌చ్చారు. కానీ పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రీతిరెడ్డి వైపు ఆస‌క్తిచూప‌లేదు.

కానీ ఆ ఎన్నిక‌ల్లో ప్రీతిరెడ్డి వైపు బీజేపీ ఆస‌క్తిచూప‌లేదు. అయినా…బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండ‌డంతో త‌న విద్యా వ్యాపారాల అవ‌స‌రం కోసం ఆ పార్టీతో స‌న్నిహితంగా ఉండ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని గ్ర‌హించారు. పార్టీ మార్పు విష‌యంలో చ‌ర్చ‌కు వ‌స్తే త‌న వ‌య‌సు 75 దాటింద‌ని, తాను ఏ పార్టీలోకి వెళ్ల‌న‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసే మల్ల‌న్న‌….. భ‌విష్య‌త్ రాజ‌కీయ వారుసుల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణాలో మామను మించిన కోడ‌లిగా ప్రీతిరెడ్డి మ‌ల్లారెడ్డి రాజ‌కీయాల‌ను, వ్యాపారాల‌ను పూర్తి స్థాయిలో శాసించే స్థాయి ఎదిగారు. మామ కంటే నాలుగు మాట‌లు ఎక్కువ‌గానే మాట్లాడి అత్యంత మృదువుగా అంద‌రినీ ఒప్పించే శ‌క్తి సామ‌ర్థ్యాలున్న మ‌హిళగా గుర్తింపు పొందారు. ఇక వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నాటికైనా ఎమ్మెల్యేతో పాటు ఎంపీ స్థానాల‌కు క‌ర్చీఫ్ వేసుకునే విధంగా మ‌ల్ల‌న్న పావులు క‌దుపుతున్నారు.

ప్రీతిరెడ్డి ఓ ఛానల్ ఇచ్చిన ఇచ్చిన ఇంట‌ర్యూలో అభిప్రాయాలు….

ఇటీవ‌లే కుటుంబ స‌భ్యుల‌తో ఢిల్లీ వెళ్లిన మ‌ల్లారెడ్డి ప్ర‌ధాన‌మంత్రి మోడీని క‌లిశారు. మోడీని క‌లిసిన అనంత‌రం మ‌ల్లారెడ్డి కోడ‌లు బీజేపీ కేంద్ర కార్యాయ‌లానికి రావ‌డం హాట్ హాట్ గా మారింది. గ‌తంలో ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ప్రీతి రెడ్డి మాట్లాడుతూ తాను అభిమానించే నేత మోడీ అని చెప్పుకొచ్చారు. మోడీ ప్ర‌ధానిగా ఉండ‌డంతోనే దేశం భ‌ద్రంగా ఉంద‌ని చెప్పారు. బీజేపీ కార్యాల‌యానికి ప్రీతి రెడ్డి రావ‌డంతో రాజకీయంగా ఆమెకు ఉన్న ఆస‌క్తిని తెలియ‌చేస్తోంది. తాను మొద‌లు పెట్టిన వ్యాపారాల‌ను ఉన్న‌త విద్యావంతురాలుగా త‌న కోడ‌లు ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తార‌ని మ‌ల్లారెడ్డి బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేస్తారు. ఇక ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాల‌యానికి వెళ్ల‌డం వెనుక మ‌ల్లారెడ్డి పావులు క‌దుపుతున్నార‌న‌ది మాత్రం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *