(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
హోం గ్రౌండ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ కు గుజరాత్ ఓపెనర్లు భారీ సవాల్ విసిరారు. గుజరాత్ టైటన్స్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ల భాగస్వామ్యం జట్టు కు శుభారంభాన్ని అందించింది. పవర్ ప్లే తో పాటు సగం ఓవర్ల పాటు ఓపెనర్లే ఎలాంటి తడబాటు లేకుండా జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టారు. ఆర్ సీబీ బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు. కానీ 15 ఓవర్ల తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడం, ఆర్సీబీ బౌలర్లు కట్టు దిట్టంగా బ్యాటింగ్ చేయడంతో జీటీ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీటీ బ్యాటర్లు భారీ స్కోరు చేసేందుకు ఓపెనర్లు అందించిన ఇతర బ్యాటర్లపై వత్తిడి తగ్గించింది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి బ్యాటింగ్ లో తడబడుతున్న సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో చెలరేగారు. సాయి ఫాంలోకి రావడంతో వంద పరుగులు చేశారు. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు తొలి వికెట్ భాగస్వామ్యానికి 12.4 ఓవర్లలో 128 జోడించారు. ఈ పరుగులో గిల్ కేవలం 24 బాల్స్ ఎదుర్కొని 32 పరుగులు చేసి ఔటయ్యారు. అప్పటికీ సెంచరీకి చేరువలో ఉన్న సాయి సుదర్శన్ సెంచరీ 58 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేశారు. 11 ఫోర్లు, 5 సిక్స్ లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడ్డారు.

16వ ఓవర్లో జట్టు స్కోరు పెంచే ప్రయత్నాల్లో సాయి పెవీలియన్ చేరుకున్నారు. గిల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోస్ కూడా భారీగా పరుగులు సాధించే ప్రయత్నాలు చేశారు. సాయి ఔటైన తరువాత వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వచ్చి రాగానే సిక్స్ కొట్టి ఆర్సీబీ బౌలర్లకు హెచ్చరికలు పంపారు.జోస్ బట్లర్ 16 బాల్స్ ఎదుర్కొని 25 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో వెనుదిరిగారు. హేజిల్ ఉడ్, భువనేశ్వర్, సుయాష్ శర్మలు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
చివరి ఓవర్లలో జీటీ బ్యాటర్లు పరుగులను ఇవ్వకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. పరుగులు ఆర్సీబీ సాధించలేకపోయింది. వాషింగ్టన్ సుందర్, హోల్టర్ చివరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్య బౌలింగ్ లో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టడంతో 200 పరుగులను జీటీ దాటింది. చివరి ఓవర్ వేసిన పాండ్య 18 పరుగులు రాబట్టారు.20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.






Leave a Reply