(హైదరాబాద్, న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు. తెలంగాణా సర్కార్ 8,9 తేదీల్లో తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులను ఈ సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకోవడంతో సీఏం రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించనున్నారు.

జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నాయి. విజన్ 2047 లక్ష్యంగా తెలంగాణా సర్కార్ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ సమ్మిట్ కు విపక్ష నేత రాహూల్ గాంధీని కూడా సర్కార్ ఆహ్వనించనుంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్కలు సమ్మిట్ కు ఆహ్వానించే నేతలను కలిసి ఆహ్వానించనున్నారు




Leave a Reply