(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ భారీ స్కోర్ల నమోదైన మ్యాచ్ లే ప్రేక్షకులను అలరిస్తాయి. అసలైన మజా అందిస్తాయి. కాని తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్ లు కూడా చివరి వ రకు ఉత్కంఠ రేపుతున్నాయి.ఈ రోజు కోల్ కత్త నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది.ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది.
సూపర్ ఓవర్ ను కేకేఆర్ నుంచి సునిల్ నరేన్ మొదలు పెట్టారు. ఎల్ ఎస్ జీ బ్యాటర్ నికొలస్ పూరన్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యారు. రెండో బంతికి ఒక్క పరుగును ఎల్ ఎస్ జీ తీసింది. మూడో బంతికి భారీ షాట్ ఆడబోయిన మార్కరం బౌండరీ దగ్గర రింకూ సింగ్ తీసుకున్న క్యాచ్ తో వెనుదిరిగారు. మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఎల్ ఎస్ జీ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ రోజు మ్యాచ్ లో రింకూ దీంతో కలుపుకుని ఐదవ క్యాచ్ తీసుకున్నారు.

రెండు పరుగల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ ఆరు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన టార్గెట్ ఇచ్చింది. కేకేఆర్ తరపున రింకూ సింగ్- పావెల్ లు బ్యాటింగ్ కు దిగారు. ఎల్ ఎస్ జీ తరపున రింకూ బ్యాటింగ్ మొదలు పెట్టగా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చేశారు. మొదటి బంతికి ఫోర్ కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది.రింకూ ఈ మ్యాచ్ లో కేకేఆర్ ను గెలిపించారు.
159 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన లక్నో సూపర్ జెంట్స్ బ్యాటింగ్ తడబడుతూ సాగింది. కేకేఆర్ బౌలర్లు లక్నో బ్యాటర్లును అంత సులువుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. 2వ ఓవర్లోనే ఓపెనర్ మార్ష్ వికెట్ కోల్పోయినా….. రెండో వికెట్ భాగస్వామ్యం వరకు జట్టు కోలుకున్నట్లు కనిపించింది. కెప్టన్ రిషబ్ పంత్- మార్కరం లు నిలదొక్కుని బ్యాటింగ్ చేయడంతో గాడిన పడింది. మార్కరం 31 పరుగులు చేసి 65 పరుగుల స్కోరు వద్ద ఔట్ కావడంతో కేకేఆర్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తరువాత కొద్ది సేపటికే నిలదొక్కుకున్న రిషబ్ పంత్ కూడా 42 పరుగులు చేసి వెనుదిరిగారు.

పంత్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పూరన్ ఒకే పరుగు చేసి పెవీలియన్ చేరుకున్నారు. 15వ ఓవర్ వరకు జట్టు స్కోరు 95 పరుగులకు చేరుకున్న సమయంలో కీలక బ్యాట్స్ మెన్ ముకుల్ చౌదరీ కూడా ఔట్ కావడంతో జట్టు పై వత్తిడి పెరిగింది. హిమ్మత్ సింగ్- బదోని ల జోడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 120 పరుగుల వద్ద 27 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన బదోని వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ తడబడింది….
వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా మిగిలిన బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు టార్గెట్ గా మారాయి. పరుగులేమి చేయకుండానే క్యాచ్ డ్రాప్ తో బ్రతికి పోయిన లిండే రెండు ఫోర్లు కొట్టి వైభవ్ సింగ్ బౌలింగ్ లో రింకూ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.18 వ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు సాధించండంతో చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి.
త్యాగి తెచ్చిన సూపర్ ఓవర్…
చివరి ఓవర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ చేసి మొదటి బంతి వైడ్ వేశారు. దీంతో 5 బాల్స్ లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. కాని ఆ తరువాతి బాల్ కూడా నోబ్ వేయడంతో ఎల్ ఎస్ జీ కి మరో పరుగుతో పాటు కలిసి వచ్చింది. మూడో బంతి కూడా నోబ్ గా అంపైర్ ప్రకటించారు. బ్యాటర్లు రెండు పరుగులు తీశారు. దీనిపై నైట్ రైడర్స్ సమీక్షకు వెళ్లింది. డీఆర్ ఎస్ లో కూడా నోబ్ గా తేలింది. 5 బంతుల్లో 12 పరుగులు కేకేఆర్ గెలుపుకు అవసరం అయ్యాయి. ఫ్రీ హిట్ బాల్ కు హిమ్మత్ ఫోర్ గా మలిచారు. 4 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా హిమ్మత్ సింగ్ త్యాగి బౌలింగ్ లో హిమ్మత్ సింగ్ రింకూ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. 148 పరుగుల వద్ద ఎల్ ఎస్ జీ 8వ వికెట్ కోల్పోయింది. 3 బంతుల్లో 8 పరుగులు అవసరం కాగా ఒక పరుగు తీశారు. 2 బంతుల్లో 7 పరుగులు కేకేఆర్ విజయం కోసం అవసరం అయ్యాయి దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.ఐదో బంతికి కేకేఆర్ ఎలాంటి పరుగులు చేయలేకపోయింది. ఇక ఒక్క బాల్ కు 7 పరుగులు చేయడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. కాని షమీ ఈ బాల్ ను సిక్స్ కు తరలించడంతో కేకేఆర్ స్కోరు ను ఎల్ ఎస్ జీ సమం చేసింది.బ్యాటింగ్ లో కేకేఆర్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన రింకూ సింగ్…ఫీల్డింగ్ లో నాలుగు క్యాచ్ లు తీసుకున్నారు.వత్తిడి లో బౌలర్ త్యాగి చేసిన తప్పులు కేకేఆర్ సులువుగా గెలుపొందాల్సిన మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు దారి తీశాయి.










Leave a Reply