(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అందరిలోనూ అసక్తి రేపింది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా పంజాబ్ కింగ్స్… జోరుమీదన్న జట్టుగా ఆర్ ఆర్ లు ఈ సీజన్లో గుర్తింపు పొందాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ లు 3 ఓవర్లలో 37 పరుగులకు జట్టు స్కోరును తీసుకెల్లారు. 3వ ఓవర్ చివరి బంతికి ప్రియాన్ష్ ఆర్య 11 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో సోయినిస్ చేసిన పరుగులే పంజాబ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాయి.

దీంట్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ప్రభ్ మన్ ఈ మ్యాచ్ లో కూడా ఆర్ధ సెంచరీ చేసి రాణించారు. 44 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్ ఆర్ జట్టు బ్యాటింగ్ లైనప్ దృష్టిలో ఉంచుకుని పంజాబ్ బ్యాటర్లు వీలైనన్ని ఎక్కువ పరుగుల చేసే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. కాన్లీ కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని .2 ఫోర్లు, 3 సిక్స్ లతో 30 పరుగులు చేశారు. ఫాంలో ఉన్న కెప్టన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించినా….. 27 బంతుల్లో 30 పరుగులు చేసి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యరు. ఆ తరువాత బ్యాటింగ్ లో స్టోయినిస్, సూర్యాంన్ష్ లు చెలరేగారు. స్టోయినిస్ 22 బంతుల్లో 62 పరుగులు చేశారు. స్టోయినిష్ ఫినిషింగ్ లో భారీ షాట్లు ఆడి చివరి ఓవర్లో 24 పరుగులు చేయడంతో పంజాబ్ 200 పరుగుల స్కోరును సులువుగా దాటించింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో యష్ రావ్ 2, ఆర్చర్, బర్గర్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.











Leave a Reply