( స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఎస్ఆర్ హెచ్ అందుకు అనుగుణంగానే బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్లు ముంబాయి బౌలర్లపై ఎదురుదాడికి తొలి ఓవర్ నుంచే దిగారు. పవర్ ప్లేలోనే భారీ గా పరగులు సాధించి ముంబాయికి గెలిచేందుకు తాము సిద్దం అవుతున్నామన్న సంకేతాలు ఇచ్చారు. 8 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఎస్ ఆర్ హెచ్ 129 పరుగులు చేసింది. 8.4 ఓవర్ల వద్ద స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. 24 బంతులను ఎదుర్కొన్న అభిషేక్ 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి వెనుదిరిగారు. మరో వైపు ఇప్పటి వరకు మ్యాచ్ లలో అంతగా రాణించని ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో తన ప్రతాపాన్ని చూపారు. అభిషేక్ ఔటైనా తాను ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. అభిషేక్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ తొలి బంతికే బౌల్డ్ అయ్యారు. దీంతో 129 పరుగుల వద్దనే ఎస్ ఆర్ హెచ్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత ట్రావిస్ హెడ్, క్లాసెన్ లో జట్టు స్కోరును పెంచే బాధ్యతలను తీసుకున్నారు. హెడ్ ఈ మ్యాచ్ లో తన విశ్వ రూపం చూపారు. 30 బంతులు మాత్రమే ఎదుర్కొని 8 సిక్స్ లు, 4 ఫోర్లతో 76 పరుగులు చేసిన తరువాత హర్దిక్ పాండక్య బౌలింగ్ లో ఔటయ్యారు.9.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులకు ఎస్ ఆర్ హెచ్ జట్టు చేరుకుంది.


క్రీజులో నిలదొక్కుకున్న క్లాసిన్ ఫోర్లు, సిక్స్ లతో ముంబాయి బౌలర్లను హడలెత్తించారు. 22 బంతుల్లోనే 50 పరుగుల చేసి జట్టును విజయానికి మరింత చేరువ చేశారు. మరో వైపు నితీష్ రెడ్డి కూడా క్లాసెన్ కు సహకారం అందిస్తూనే అవకాశం దొరికితే బంతిని బౌండరీకి తరలించి స్కోరు పెంచారు.213 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో నితీష్ 21 పరుగులు చేసి క్లాసెన్-నితీష్ లు 80 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. క్లాసిన్ 30 బాల్స్ ఎదుర్కొని 65 పరుగులు, సలీల్ అరోరా 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ముంబాయి బ్యాటింగ్…..

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ముంబాయి ఓపెనర్లు విల్ జాక్స్, రికెల్టన్లు భారీ షాట్లతో ఎస్ ఆర్ హెచ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. 7 ఓవర్లలోనే 93 పరుగులకు జట్టు స్కోరును తీసుకెళ్లారు. అక్కడ విల్ జాక్స్ 22 బంతుల్లో 45 పరుగులు చేసి ఔటయ్యారు. మరో వైపు రికెల్టన్ తన జోరు పెంచుతూ వచ్చారు. జాక్స్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో కూడా పెద్దగా రాణించలేదు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.110 పరుగుల వద్ద 2 వ వికెట్ కోల్పోయింది. యలమన్ ధీర్ బ్యాటింగ్ కు వచ్చి17 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యారు. 13.4 ఓవర్లలో 165 పరుగులు చేసి 3 వికెట్లను ముంబాయి కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టన్ పాండ్య వేగంగా పరుగులు చేసే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తూ 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి వెనుదిరిగారు. తిలక్ వర్మ కూడా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలీయన్ చేరుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రికెల్టన్ తన జోరును క్రమంగా పెంచి జట్టు స్కోరు భారీగా పెంచేయత్నం చేశారు.55 బంతులను ఎదుర్కొని 123 పరుగుల చేశారు. దీంట్లో 10 ఫోర్లు 8సిక్సలు రికెల్టన్ కొట్టారు. దాదాపు వంద పరుగులు సిక్స్ లు, ఫోర్లతోనే తన స్కోరు చేశారు. హార్దిక్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నారు.











Leave a Reply