(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
రెండు మాజీ ఐపీఎల్ ఛాంపియన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ చెన్నై బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించేందుకు అవస్థలు పడింది. ఈ మ్యాచ్ టీ -20 మ్యాచ్ కు భిన్నంగా నామమాత్రపు పరుగులతోనే ముంబాయి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముంబాయి ఇండియన్స్ 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టన్ హర్ధిక్ పాండ్య చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేసి 22 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగారు. ముంబాయి జట్టుకు భారీగా పరుగులు రాబట్టడంలో సఫలం కాలేదు.చెన్నై బౌలర్లను ఎదుర్కొని తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్ధిక్ టీం…అనుకున్న స్థాయిలో చెన్నై జట్టు ముందు లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.

రెండో ఓవర్లలోనే ముంబాయి తొలి వికెట్ విల్ జాక్స్ వికెట్ కోల్పోయింది. కేవలం ఒక పరుగు చేసి జాక్స్ పెవీలియన్ చేరుకున్నారు. ఆ తరువాత రికెల్టన్- నమన్ ధీర్ లు రెండో వికెట్ కోసం మంచి భాగస్వామ్యం అందిచారు. చెన్నై బౌలర్లను ఎదుర్కొంటూ భారీగానే పరుగులు రాబట్టడంలో విజయవంతం అయ్యారు.రికెల్టన్ కేవలం 24 బంతుల్లో 5 సిక్స్ లతో 37 పరుగులు చేసి7వ ఓవర్లో 59 పరుగుల స్కోరు వద్ద ఔటయ్యారు. నమన్ ధీర్ మాత్రం చెన్నై బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడంలో విజయవంతం అయ్యారు.

ఫాం లేమితో సతమతం అవుతున్న సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొని 21 పరుగులు చేసి ఔటయ్యరు. తిలక్ వర్మపై జట్టు భారీగా ఆశలు పెంచుకున్నా కేవలం 5 పరుగులు మాత్రమే చెసి వెనుదిరిగారు. నమన్ ధీర్- హర్దిక్ పాండ్యలు స్కోరు ను ముందుకు తీసుకెల్లే ప్రయత్నం చేశారు. హార్ధిక్ పాండ్య చెన్నై బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డారు. నమ్ ధీర్ 37 బంతుల్లో 57 పరుగులు చేసి సర్ఫరాజ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో ఔటయ్యారు. 139 పరుగుల వద్ద ముంబాయి 5వ వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంభోజ్ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు , రామకృష్ణ, ఓవర్టన్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.








Leave a Reply