సమస్యలు పరిష్కారించాలి
(హైదరాబాద్, న్యూస్ఇన్)
పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ)ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా ధర్నా నిర్వహించారు.. టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం.

ఈ మహా ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ, జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహా ధర్నాలో భాగస్వామ్యమయ్యాయి.





Leave a Reply