NewsInn

News in a Click

హైద‌రాబాద్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

హైద‌రాబాద్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణాలో ప‌ర్య‌టించనున్నారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వాల అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని పాల్గొటారు. బీజేపీ జ‌న‌గ్ర‌హ స‌భ పేరుతో ఈ బ‌హిరంగ స‌భ ను నిర్వ‌హిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ హాయంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు…ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టి లో ఉంచుకుని ఈ పేరును ఖ‌రారు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల మ‌హిళా బిల్లుతో పాటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించిన బిల్లు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టింది. మ‌హిళా బిల్లుకు ఆమోదం తెలిపిన‌ట్లు అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌క‌టించినా ఆచ‌ర‌ణ‌లో అది సాధ్యం కాలేదు. మ‌రో వైపు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న పై రాజ‌కీయంగా దూమారం రేగింది. బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మార‌డంతో రెండు బిల్లుల‌కు పార్ల‌మెంట్ ఆమోదం ద‌క్క‌లేదు. దీంతో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపిస్తూ బీజేపీ నిర‌స‌న‌లు చేసింది. ఆదివారం నాటి స‌భ‌లో మోడీ ఈ అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది.

పూర్తి షెడ్యూల్….

మే 10వ తేదీన మోదీ మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి హైటెక్స్ కు హెలిక్యాప్ట‌ర్ లో వెళ్లి వెళ్లి పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.వరంగల్ జిల్లాలోని మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం, చేనేత క్లస్టర్ ఏర్పాటు, గిరిజ యూనివర్సిటీలో పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వ‌ర్చువ‌ల్ గా పాల్గొంటారు. హైటెక్స్ సిటీలో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించి వైద్య నిపుణులతో మాట్లాడతారు. అక్కడి నుండి మళ్ళీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిపై కేంద్రమంత్రులు, బీజేపీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ త‌రువాత ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరుతారు.

రూ. 9,400 కోట్ల అభివృద్ధి ప‌నులు….

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో రూ.9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి.బీబీనగర్ ఎయిమ్స్ నూతన విభాగాలు, ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల ప్రారంభోత్సవం చేసే విధంగా కార్యక్రమం సిద్ధం చేశారు.హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ, మల్కాజిగిరి అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రారంభించే అవకాశం ఉంది. హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.ఇవి కాక మౌలిక సదుపాయాలు, రవాణా, విద్యుత్ రంగాల్లో పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.మ‌మూనూరు విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

బీజేపీ ‘జన ఆగ్రహ సభ…..

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం బీజేపీ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొంటారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు బీజేపీ నేత‌లు గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జ‌న‌స‌మీక‌ర‌ణ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం జిల్లాల వారిగా ప్ర‌త్యేక బాధ్య‌త‌ల‌ను నేత‌ల‌కు అప్ప‌గించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల కోసం ప్ర‌త్యేక రైళ్ల‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డంతో కాంగ్రెస్ ను ప్ర‌ధాని టార్గెట్ చేసే అవ‌కాశాలున్నాయి.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు……

ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌త్యంలో ప్ర‌భుత్వం కూడా అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ రావ్ స‌మీక్ష స‌మావేశాల‌ను నిర్వ‌హించి మోడీ ప‌ర్య‌ట‌న‌కు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్ర‌కారం పోలీసు శాఖ భ‌ద్ర‌త‌, శాంతి భ‌ద్ర‌త‌లు, ట్రాఫిక్ వంటి అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు ఆదేశాల‌ను అధికారుల‌కు సీఎస్ ఇచ్చారు.

నో ఫ్ల‌యింగ్ జోన్….

మోదీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతా చ‌ర్య‌ల్లో భాగంగా నో ఫ్లయింగ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు డ్రోన్లు ఎగరేయడం పూర్తిగా నిషేధం. పారాగ్లైడర్లు వంటి విమాన వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నియమాలు మే 10 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయి. ప‌లు చోట్ల ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *