(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
PBKS Vs DC మ్యాచ్ లో భారీ స్కోరు లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో తడబడింది. 211 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బరిలో దిగి ఓపెనర్ల వికెట్లు త్వరగానే కోల్పోయింది. కే ల్ రాహుల్, అభిషేక్ పోరెల్ 14 పరుగుల స్కోరు లోపే ఔటయ్యారు. 5 ఓవర్లలో 33 పరుగుల వద్ద 3వ వికెట్ ను ఢిల్లీ క్యాబిట్సల్ కోల్పోవడంతో పంజాబ్ కింగ్స్ సునాయస విజయం సాధిస్తుందన్నధీమా కు వచ్చింది. ఆతరువాత అసలు మ్యాచ్ మొదలైంది. కెప్టన్ అక్షర్ పటేల్ , స్టబ్స్ వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 74 పరుగుల వద్దకు చేర్చారు. అక్కడ స్టబ్స్ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. అక్షర్ కు మిల్లర్ తోడు కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మిల్లర్ తన దైన జోరు చూపిస్తూ పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. 28 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 39 బాల్స్ ఎదుర్కొని 56పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంలో అక్షర్ ఈ స్కోరు నమోదు చేయడంతో డీల్లీ గెలుపుకు చేరువైంది. ఈ ఇద్దరు బ్యాటర్లు ఓటౌన మిగిలిన బ్యాటర్లు తమ జోరును కొనసాగించారు. అసుతోష్ శర్మ 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 24 పరుగులు చేశారు. మాధవ్ తివారి 8 బాల్స్ ఎదుర్కొని 18 పరుగులు చేయడంతో ఢిల్ఈ విజయం ఖాయమైంది. 19 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ పై విజయం నమోదు చేసుకుంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్….

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లపై విరుచుకు పడ్డారు. 7 ఓవర్లలో 78 పరుగులు చేసి తొలి వికెట్ పంజాబ్ సిమ్రాన్ రూపంలో కోల్పోయింది. ఓపెనర్లు జోరుగా బ్యాటింగ్ మొదలు పెట్టడంతో ఆ తరువాత బ్యాటర్లు కూడా దీన్ని కొనసాగించారు.15 బాల్స్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య తన దూకుడును ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించారు. 33 బాల్స్ ఎదుర్కొని 56 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రేయస్ అయ్యర్- ప్రియాన్ష్ లు రెండో వికెట్ కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 97 పరుగుల వద్ద ప్రియాన్ష్ ఔటయ్యారు. ఆతరువాత 180 పరుగుల వద్ద కూపర్ కాన్లీ ఔటయ్యారు. కాన్లీ 27 బాల్స్ లో 38 పరుగులు చేశారు. ఆ తరువాత మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ లు వెంట వెంటనే ఔటయ్యారు. కెప్టన్ శ్రేయస్ అయ్యర్ 36 బాల్స్ఎదుర్కొని 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.












Leave a Reply